అక్షరటుడే, హైదరాబాద్: Scholarships | కె.సి. మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్ (KCMET) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సులు చదివే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం మహీంద్రా ఆల్ ఇండియా టాలెంట్ స్కాలర్షిప్ (MAITS) 2025కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ స్కాలర్షిప్ ద్వారా ఎంపికైన 550 మంది విద్యార్థులకు ఏటా రూ. 10,000 చొప్పున గరిష్టంగా మూడేళ్ల పాటు ఆర్థిక సహాయం అందిస్తారు.
Scholarships | అర్హతలు ఏమిటి?
10వ లేదా 12వ తరగతిలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో (government polytechnic college) డిప్లొమా మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి.
Scholarships | ముఖ్యమైన తేదీలు, సమాచారం:
ఆంధ్రప్రదేశ్ (Andhra pradesh), తెలంగాణ విద్యార్థులకు (Telangana Students) దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: ఆగస్టు 27, 2025.
దరఖాస్తు ఫారం, అవసరమైన పత్రాల జాబితా కోసం https://maitscholarship.kcmet.org/ ను సందర్శించండి.
ఏదైనా సందేహాల కోసం maits@mahindra.com ను సంప్రదించవచ్చు.
ఈ స్కాలర్షిప్ (scholarship) పంపిణీలో అమ్మాయిలకు, దివ్యాంగులకు, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు, అలాగే సాయుధ బలగాల సిబ్బంది పిల్లలకు ప్రాధాన్యత ఇస్తారు. 1995లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 12,940 మంది విద్యార్థులు లబ్ధి పొందారు.