- Advertisement -
HomeUncategorizedNEET Results | నీట్‌ ఫలితాలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

NEET Results | నీట్‌ ఫలితాలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Results | నీట్​ ఫలితాలపై NEET Results | మద్రాస్​ హైకోర్టు madras high court స్టే విధించింది. తమ పరీక్ష కేంద్రంలో విద్యుత్​ సరఫరాలో అంతరాయం కారణంగా పరీక్ష exam సరిగ్గా రాయలేకపోయామని పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్​ వేశారు. కేంద్రంలో కరెంట్​ పోయినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఫలితాలను విడుదల చేయొద్దని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూన్​ 2కు వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్‌ ఫలితాలపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు madya pradesh high court సైతం స్టే విధించింది.

మెడికల్​ కాలేజీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ NTA మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 20.8 లక్షల మంది పరీక్ష రాశారు. వారు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కోర్టులు స్టే ఇవ్వడంతో ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News