Homeజిల్లాలుకామారెడ్డిLorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు...

Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్ jogging పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు.

ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ ఆ యువకులను ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ఈ ఘటన కామారెడ్డి Kamareddy జిల్లా రామేశ్వర్ పల్లి పరిధి 44వ నంబరు జాతీయ రహదారి National Highway పై శుక్రవారం (సెప్టెంబరు 12) ఉదయం చోటుచేసుకుంది.

Lorry hits : బాధిత యువకుల కథనం ప్రకారం..

కామారెడ్డి Kamareddy మండలం శాబ్దిపూర్ రైట్ తండాకు చెందిన శివకుమార్​ సోలార్ ప్లాంట్​ లో పని చేస్తున్నాడు. రామేశ్వర్ పల్లి తండాకు చెందిన భదావత్ సంజీవ్ చదువుకుంటున్నాడు.

ఇద్దరు కలిసి శుక్రవారం ఉదయం 5 గంటలకు జాగింగ్ కోసమని జాతీయ రహదరిపైకి వెళ్లారు. గంటన్నర తర్వాత జాగింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టారు.

కాగా మేఘన దాబా సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన లారీ యువకులను ఢీకొట్టి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని జీజీహెచ్ కు తరలించారు.

శివకుమార్​కు తీవ్ర గాయలయ్యాయి. సీరియస్​గా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సంజీవ్​కు జీజీహెచ్​లో చికిత్స కొనసాగుతోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Must Read
Related News