అక్షరటుడే, కామారెడ్డి: Sadashivnagar | ఎదురుగా వస్తున్న బైక్ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్ మండలం మోడెగాం శివారులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డికి చెందిన గంగుల నర్సాగౌడ్(55) మొండి సడక్ నుంచి చిన్న మల్లారెడ్డికి బైక్పై వెళ్తున్నాడు. మోడెగాం శివారులోని రైస్మిల్(Rice Mill) వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ బైకును ఢీకొంది. ఈ ప్రమాదంలో నర్సాగౌడ్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
