అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | గణపతి నిమజ్జనం(Ganesha immersion) కోసం ట్రాలీ ట్రాక్టర్ను (Trolley tractor) తీసుకెళ్తుండగా లారీ ఢీకొంది. ఈ ఘటన కామారెడ్డి జాతీయ రహదారిపై క్యాసంపల్లి (Kyasam Pally) శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీసులు.. బాధితుల కథనం ప్రకారం.. దోమకొండకు (Domakonda) చెందిన యువకులు రామారెడ్డి నుంచి గణపతి ట్రాలీని తీసుకుని వెళ్తున్నారు. ట్రాక్టర్ ఇంజిన్కు ఇరువైపులా నలుగురు యువకులు కూర్చున్నారు. ట్రాలీ బైపాస్ రోడ్డుపై క్యాసంపల్లి శివారులోకి రాగానే వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని లారీ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొంది.
ఈ ఘటనలో ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చున్న నలుగురికి గాయాలయ్యాయి. దోమకొండకు చెందిన సాయికుమార్, శ్రీధర్తో పాటు ట్రాక్టర్ నడుపుతున్న రాజయ్య గాయపడ్డారు. ఇందులో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ (Hyderabad) రిఫర్ చేశారు. మరొక యువకుడిని సైతం నిజామాబాద్ (Nizamabad)కు రిఫర్ చేసినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.