అక్షరటుడే, వెబ్డెస్క్ : Medak | మెదక్ (Medak) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ లారీ డ్రైవర్ కారును ఢీకొనడమే కాకుండా.. ఆపమంటే సదరు వ్యక్తిపై నుంచి లారీని తీసుకెళ్లాడు. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు. మెదక్ జిల్లాలోని నార్సింగి NH 44పై ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
సత్తిరెడ్డి అనే వ్యక్తి కారులో నార్సింగి నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్నాడు. అయితే హైవేపై కారును ఓ లారీ ఢీకొంది. అనంతరం సదరు డ్రైవర్ ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. దీంతో సత్తిరెడ్డి లారీని చేజ్ చేశాడు. లారీని అడ్డగించి.. డ్రైవర్కు కిందకు దిగమని హెచ్చరించాడు. అయితే లారీ డ్రైవర్ కిందకు దిగకుండా సత్తిరెడ్డిని ఢీకొంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.