HomeతెలంగాణNational Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను విజయవంతం చేయాలి

National Lok Adalat | జాతీయ లోక్ అదాలత్​ను విజయవంతం చేయాలి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ​: National Lok Adalat | జిల్లా వ్యాప్తంగా వచ్చేనెలలో నిర్వహించనున్న జాతీయ లోక్​ అదాలత్​ను విజయవంతం చేయాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ ఛైర్​పర్సన్​ జీవీఎన్​ భరత లక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని మీటింగ్​ హాల్​లో గురువారం మాట్లాడారు. లోక్​అదాలత్​లో బీమా కంపెనీలు, న్యాయవాదులు కేసులను రాజీ కుదిర్చే విధంగా ప్రయత్నిస్తే కక్షిదారులకు న్యాయం చేసిన వారమవుతామన్నారు. లోక్​అదాలత్​ను నడిపించేది న్యాయమూర్తులు, న్యాయవాదులేనని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు జిల్లా జడ్జి హరీష, న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్​ సివిల్​ జడ్జి ఉదయ భాస్కర్​రావు, బీమా కంపెనీల తరపున న్యాయవాదులు గోవర్ధన్​, ఆనంద్​రెడ్డి, అంకిత, గణేశ్​ దేశ్​పాండే తదితరులు పాల్గొన్నారు.