Homeజిల్లాలుకామారెడ్డిNavodaya Vidyalaya | నవోదయకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

Navodaya Vidyalaya | నవోదయకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్​: Navodaya Vidyalaya | నిజామాబాద్​లో నూతనంగా ఏర్పాటైన నవోదయ విద్యాలయంలో (Nizamabad Navodaya vidyalaya) ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం ప్రకటించారు. 6వ తరగతిలో ప్రవేశాల కోసం మొత్తం 40 మందిని ఎంపిక చేసినట్లు ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​ మను యోహన్నన్​ తెలిపారు.

Navodaya Vidyalaya | 14వ తేదీ నుంచి అడ్మిషన్లు..

నవోదయలో ఈనెల 14వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు ఇన్​ఛార్జి ప్రిన్సిపాల్​ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు స్పష్టం చేశారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు చెప్పారు.

Navodaya Vidyalaya | జనవరిలో పరీక్ష..

ఈ ఏడాది జనవరి 18న నవోదయ పరీక్ష జరిగింది. ఈ ఎగ్జామ్​కు సుమారు 6,090 మంది హాజరయ్యారు. ఇందులో భాగంగా ఇప్పటికే 80 మంది విద్యార్థులు నిజాంసాగర్​ నవోదయకు అర్హత సాధించారు. తాజాగా నిజామాబాద్​లో ఏర్పాటైన నవోదయ పాఠశాలకు 40మందిని ఎంపిక చేస్తూ అధికారులు ఉత్తర్వలు జారీ చేశారు.

ఎంపికైన విద్యార్థుల హాల్​టిక్కెట్​ నంబర్లు ఇవే..