అక్షరటుడే, వెబ్డెస్క్ : Asifabad | ఒక్క మద్యం సీసా నేలపాలైతేనే మందుబాబుల గుండె తరుక్కుపోతుంది. అలాంటిది రోడ్డుపై మద్యం ఏరులై పారితే ఎంతో వేదనకు గురి అవుతారు. కుమురం భీం ఆసిఫాబాద్(Asifabad) జిల్లాలో రోడ్డుపై మద్యం ఏరులై పారింది.
అధికారులు తనిఖీలు చేసి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. అనంతరం దానిని ధ్వంసం చేస్తారు. తాజాగా ఆసిఫాబాద్ జిల్లాలో ఏకంగా రూ.21 లక్షల విలువైన మద్యం బాటిళ్లను (Liquor Bottles) ధ్వంసం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సమయంలో చింతలమానేపల్లి మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని పోలీస్ స్టేషన్లో నిల్వ చేశారు. తాజాగా ఎస్పీ కాంతిలాల్ ఆధ్వర్యంలో ఆ మందు బాటిళ్లను రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు.