అక్షరటుడే, ఇందూరు: Lions Club | జిల్లాలో లయన్స్ క్లబ్లు సేవే లక్ష్యంగా పనిచేస్తున్నాయని లయన్స్ నిజామాబాద్ రీజియన్ (Nizamabad Region) ఛైర్మన్ ఉదయ సూర్యభగవాన్ పేర్కొన్నారు. నగరంలోని సందీప్గార్డెన్లో శుక్రవారం లయన్స్ ఇంటర్నేషనల్ (Lions International) నిజామాబాద్ రీజియన్ అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ రీజియన్ పరిధిలో క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ‘శుభారంభ్’ పేరిట ఒకేరోజు 85 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమాలను మరింత విస్తృత పర్చాలని క్లబ్ పీఎస్టీలకు సూచించారు. కార్యక్రమంలో లయన్స్ జిల్లా కార్యదర్శి డి.యాదగిరి, అదనపు కోశాధికారి పి.లక్ష్మీనారాయణ, రీజియన్ కో–ఆర్డినేటర్ నాగేశ్వరరావు, రీజియన్ పీఆర్వో చింతల గంగాదాస్, జోన్ ఛైర్మన్లు దారం భూమన్న, బొబ్బ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.