ePaper
More
    Homeజిల్లాలుజోగులాంబ గద్వాల్Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాధ ఘటన జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో చోటు చేసుకుంది.

    బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా వర్షాలు (Rains) పడుతున్న విషయం తెలిసిందే. గద్వాల జిల్లాలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో అయిజ మండలం భూంపురం గ్రామంలో పిడుగు పడింది. పత్తిచేను (Cotton Crop)లో పిడుగు పడటంతో.. పనులు చేపడుతున్న ముగ్గురు కూలీలు మృతి చెందారు.

    Thunderstorm | పనులు చేస్తుండగా..

    భూంపురం గ్రామానికి చెందిన పార్వతమ్మ (22), సర్వేశ్‌ (20), సౌభాగ్యమ్మ (40), మరో ఇద్దరు పత్తి చేనులో కూలీ పని చేయడానికి వెళ్లారు. సాయంత్రం పూట పనులు చేపడుతుండగా పిడుగు పడింది. దీంతో పార్వతమ్మ, సర్వేశ్​, సౌభాగ్యమ్మ మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం గద్వాల ఆస్పత్రికి తరలించారు.

    Thunderstorm | గ్రామంలో విషాదం

    గ్రామానికి చెందిన ముగ్గురు ఒకే రోజు చనిపోవడంతో భూంపురంలో విషాదఛాయలు అలుముకున్నారు. స్థానికుల సమాచారం మేరకు అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....