ePaper
More
    HomeజాతీయంPrajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు.. అత్యాచారం కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna)కు శనివారం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. మైసూర్‌లోని ఇంటి పనిమనిషి దాఖలు చేసిన అత్యాచారం కేసు(Rape Case)లో రేవణ్ణపై ఆరోపణలు రుజువు కావడంతో 14 నెలల తర్వాత దోషిగా తేలుస్తూ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

    Prajwal Revanna | గతేడాది ఇంటి పనిమనిషి ఫిర్యాదు

    రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్‌(Farm House)లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న ఒక మహిళ గతేడాది ఏప్రిల్‌లో రేవణ్ణపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2021 నుంచి రేవణ్ణ తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంది. ఎవరికైనా చెబితే వీడియోలను విడుదల చేస్తానని బెదిరించాడని ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు రేవణ్ణను గతేడాది మే 31న అరెస్టు చేశారు.

    READ ALSO  Al-Qaeda Terror | గుజ‌రాత్‌లో అల్‌ఖైదా టెర్ర‌ర్ మాడ్యూల్.. మ‌హిళను అరెస్టు చేసిన ఏటీఎస్‌

    Prajwal Revanna | 14 నెలల్లో తీర్పు

    ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదు చేసిన పోలీసులు ఛార్జిషీటును కోర్టులో సమర్పించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(Forensic Science Lab) నివేదికలు, స్పాట్ ఇన్‌స్పెక్షన్ నివేదికలు, బాధితురాలు సమర్పించిన భౌతిక సాక్ష్యాలు(చీరపై స్పెర్మ్ ఆనవాళ్లు) ఈ కేసులో కీలకంగా మారాయి. 23 మంది ప్రత్యక్ష సాక్షులను విచారించిన కోర్టు, ఈ సాక్ష్యాల ఆధారంగా ప్రజ్వల్‌ను దోషిగా నిర్ధారించింది.

    Prajwal Revanna | కర్ణాటక రాజకీయాల్లో చర్చ

    ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు(Special Court), ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చి, జీవిత ఖైదు శిక్ష విధించింది. ఈ కేసులో వివిధ సెక్షన్ల కింద అతడికి కనీసం పదేళ్ల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేశారు. కోర్టు తీర్పు ప్రకటించిన సమయంలో ప్రజ్వల్ రేవణ్ణ కోర్టులోనే ఏడ్చినట్లు అక్కడి న్యాయవాదులు తెలిపారు. ఈ తీర్పు కర్ణాటక రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

    READ ALSO  PM Kisan | రైతులకు గుడ్​న్యూస్​.. నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల

    Latest articles

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...

    Kamareddy | సోషల్ మీడియా వేదికగా దోపిడీ.. ముఠా ఆటకట్టించిన పోలీసులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అమాయకులను బెదిరిస్తూ డబ్బులు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల...

    More like this

    Minister Ponguleti | కార్పొరేట్ స్థాయిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలు : మంత్రి పొంగులేటి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Minister Ponguleti | సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో (At the Sub-Registrar's offices) సకల...

    Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    అక్షరటుడే, డిచ్ పల్లి: Dichpally | డిచ్​పల్లికి చెందిన ఓ వ్యాపారి తమ వద్ద డబ్బులు తీసుకుని, ఐపీ...

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు...