Yellareddy MLA | హైదరాబాద్​ను కాలుష్య రహిత రాజధానిగా మార్చుకుందాం: ఎమ్మెల్యే మదన్​ మోహన్​

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | హైదరాబాద్​ను కాలుష్య రహిత రాజధానిగా మార్చుకుందామని ఎమ్మెల్యే మదన్​ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. శాసనసభ సమావేశాల్లో (Legislative Assembly sessions) భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ​హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ సిటీగా మారిందని, అంతర్జాతీయ సదస్సులు, పెట్టుబడి సమావేశాలు తరచూ జరుగుతున్నాయన్నారు. Yellareddy MLA | వేగంగా పెరుగుతున్న కాలుష్యం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) ఒకటని ఎమ్మెల్యే అన్నారు. అయితే […]

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy MLA | హైదరాబాద్​ను కాలుష్య రహిత రాజధానిగా మార్చుకుందామని ఎమ్మెల్యే మదన్​ మోహన్ (MLA Madan Mohan) అన్నారు. శాసనసభ సమావేశాల్లో (Legislative Assembly sessions) భాగంగా మంగళవారం ఆయన మాట్లాడారు. ​హైదరాబాద్ ప్రస్తుతం గ్లోబల్ సిటీగా మారిందని, అంతర్జాతీయ సదస్సులు, పెట్టుబడి సమావేశాలు తరచూ జరుగుతున్నాయన్నారు.

Yellareddy MLA | వేగంగా పెరుగుతున్న కాలుష్యం

దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ (Hyderabad) ఒకటని ఎమ్మెల్యే అన్నారు. అయితే అంతే వేగంగా వాహనాల కాలుష్యం సైతం పెరుగుతోందన్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పీయూసీ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాలే ప్రధాన కాలుష్య కారకాలు అని ఆయన పేర్కొన్నారు. ఈ వాహనాలను గుర్తించేందుకు ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని సూచించారు. వాహన సారథి డేటాబేస్‌లను అనుసంధానం చేసి ప్రతి వాహనం ఫిట్‌నెస్, కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ వివరాలను పర్యవేక్షించే సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

Yellareddy MLA | కాలుష్యం కారణంగా లక్షల్లో మరణాలు..

కాలుష్యం కారణంగా భారత్‌లో ఏటా 16–17 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. ఆస్థమా, క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కాలుష్యమే ప్రధాన కారణమని తెలిపారు. వాయు కాలుష్యానికి కారణమయ్యే వారిని నేరస్థులుగా పరిగణించాల్సిందేనని ఎందుకంటే వారు పరోక్షంగా మానవ జీవితాలపై దాడి చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఢిల్లీ నగరం కాలుష్యంతో జీవించలేని స్థితికి చేరిందని.. హైదరాబాద్ అటువంటి పరిస్థితికి చేరకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలని కోరారు.

Related articles

Trump Comments | ఎంతకాలం ఉంటానో తెలియదు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

డోనాల్డ్​ ట్రంప్​ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతకాలం బతికి ఉంటానో తెలియదని అన్నారు.

Khammam House Demolition | పేదల ఇళ్ల కూల్చివేత.. ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత

ఖమ్మం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ భూమిలో నిర్మించుకున్న ఇళ్లను అధికారులు కూల్చి వేస్తున్నారు.

Virosh Wedding Celebrations | ఉదయ్‌పూర్‌లో ‘విరోష్’ పెళ్లి వేడుకలు ప్రారంభం.. పూల్ పార్టీ, జపనీస్ థీమ్ డిన్నర్‌తో సందడి

టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహిస్తోంది. సోమవారం పూల్ పార్టీ, జపనీస్ థీమ్ క్యాండిల్‌లైట్ డిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Maoist Leaders Surrender | నేడు మీడియా ముందుకు మావోయిస్ట్ అగ్రనేతలు

మావోయిస్ట్​ పార్టీ అగ్రనేతలు దేవ్​జీ, రాజిరెడ్డి ఇటీవల లొంగిపోయిన విషయం తెలిసిందే. డీజీపీ శివధర్​రెడ్డి వారి వివరాలు వెల్లడించనున్నారు.