ePaper
More
    HomeతెలంగాణRaghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు...

    Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్​రావు డిమాండ్​ చేశారు. తాము కూడా రాజీనామా చేస్తామని ఎన్నికలకు వెళ్దామని ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ (PCC Chief Mahesh Goud)కు సవాల్​ విసిరారు.

    రాష్ట్రంలో ఓటు చోరీ (Vote Chori) జరిగిందని, అందుకే బీజేపీ ఎంపీలు గెలిచారని ఇటీవల మహేశ్​గౌడ్​ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై రఘునందన్​రావు మంగళవారం స్పందించారు. వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​కు నమ్మకం ఉంటే శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దైర్యం ఉందా అని ఆయన సవాల్ చేశారు.

    Raghunandan Rao | బాధ్యత మరిచి..

    పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ బాధ్యత మరిచి ఏది పడితే అది మాట్లాడుతున్నారని రఘునందన్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం రాజీనామా చేసి కొత్త ఓటర్​ లిస్ట్​తో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. ఓటు చోరీ చేస్తే 8 మంది కాంగ్రెస్​ ఎంపీలు ఎలా గెలిచారని ప్రశ్నించారు.

    Raghunandan Rao | బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

    బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో కాంగ్రెస్​ కుంటి సాకులు చెబుతోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం నివేదిక (Kaleshwaram Report)ను ప్రజలు ముందు ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే యూరియా కొరత నెలకొందని రఘునందన్​రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో యూరియా సరిపడా ఉంటే.. మన దగ్గర మాత్రమే ఎందుకు కొరత ఏర్పడిందని ప్రశ్నించారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

    Latest articles

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...

    Uttar Pradesh | భర్తను వదిలి.. 22 ఏళ్ల మేనళ్లుడితో పారిపోయిన ఏడుగురు పిల్లల తల్లి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : వింత ఘటన కథనాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలుస్తోంది ఉత్తరప్రదేశ్‌. ముఖ్యంగ ఫ్యామిలీకి...

    More like this

    Mahindra University | మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ కలకలం.. ఏకంగా 50 మంది విద్యార్థులకు పాజిటివ్​

    అక్షరటుడే, హైదరాబాద్ : Mahindra University : తెలంగాణ రాష్ట్ర విద్యా ప్రపంచానికే తలమానికంగా ఉన్న హైదరాబాద్‌లోని మహీంద్రా...

    CP Foot Patrolling | సీపీ ఫుట్​ పెట్రోలింగ్​.. నిజామాబాదులో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గట్టి నిఘా

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : CP Foot Patrolling : గణేష్ నవరాత్రి ఉత్సవాల (Ganesh Navratri festivals)...

    POCSO court | బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 51 ఏళ్ల జైలు.. పొక్సో కోర్టు సంచలన తీర్పు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: POCSO court : నల్గొండ Nalgonda పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బాలికను అత్యాచారం చేసిన...