HomeతెలంగాణRaghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు...

Raghunandan Rao | దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం.. పీసీసీ చీఫ్​కు ఎంపీ రఘునందన్​రావు సవాల్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raghunandan Rao | దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ రఘునందన్​రావు డిమాండ్​ చేశారు. తాము కూడా రాజీనామా చేస్తామని ఎన్నికలకు వెళ్దామని ఆయన పీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ (PCC Chief Mahesh Goud)కు సవాల్​ విసిరారు.

రాష్ట్రంలో ఓటు చోరీ (Vote Chori) జరిగిందని, అందుకే బీజేపీ ఎంపీలు గెలిచారని ఇటీవల మహేశ్​గౌడ్​ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై రఘునందన్​రావు మంగళవారం స్పందించారు. వంద సీట్లు గెలుస్తామని పీసీసీ చీఫ్ అంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​కు నమ్మకం ఉంటే శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దైర్యం ఉందా అని ఆయన సవాల్ చేశారు.

Raghunandan Rao | బాధ్యత మరిచి..

పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ బాధ్యత మరిచి ఏది పడితే అది మాట్లాడుతున్నారని రఘునందన్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరం రాజీనామా చేసి కొత్త ఓటర్​ లిస్ట్​తో మళ్లీ ఎన్నికలకు వెళ్దామన్నారు. దమ్ముంటే కాంగ్రెస్​ ఎంపీలతో రాజీనామా చేయించాలన్నారు. ఓటు చోరీ చేస్తే 8 మంది కాంగ్రెస్​ ఎంపీలు ఎలా గెలిచారని ప్రశ్నించారు.

Raghunandan Rao | బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

బీసీ రిజర్వేషన్ల (BC Reservations) విషయంలో కాంగ్రెస్​ కుంటి సాకులు చెబుతోందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్​లో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం నివేదిక (Kaleshwaram Report)ను ప్రజలు ముందు ఉంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే యూరియా కొరత నెలకొందని రఘునందన్​రావు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో యూరియా సరిపడా ఉంటే.. మన దగ్గర మాత్రమే ఎందుకు కొరత ఏర్పడిందని ప్రశ్నించారు. కాగా పీసీసీ అధ్యక్షుడు మహేశ్​గౌడ్​ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్​ సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Must Read
Related News