అక్షరటుడే, ఎల్లారెడ్డి : Nagireddypet | నాగిరెడ్డిపేట బీట్ పరిధిలోని లొంకలపల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచరిస్తున్నట్లు డీఆర్వో అరవింద్, బీట్ ఆఫీసర్ నవీన్ తెలిపారు. గ్రామ శివారులోని పంట పొలాల్లో చిరుత పులి అడుగుజాడలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. చిరుత సంచారంతో స్థానిక రైతులు, ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
చిరుత సంచరిస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని బీట్ ఆఫీసర్ తెలిపారు. లొంకలపల్లి, నాగిరెడ్డిపేట, ధర్మారెడ్డి బొల్లారం బీట్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
