అక్షరటుడే, ఆర్మూర్: Chirutha | జిల్లాలో వరుసగా చిరుత పులుల ఆనవాళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎడపల్లి (Yedapally) మండలంలోని జానకంపేట్లో (janakampet) మేకలపై చిరుత దాడి చేసింది. అనంతరం అభంగపట్నంలోనూ (Abhangapatnam) లేగదూడపై చిరుతపులి దాడి చేసి చంపేసింది.
chirutha | తాజాగా ఆర్మూర్ పట్టణ శివారులో..
పట్టణ శివారులోని పెద్దమ్మగుడి ఆలయ పరిసరాల్లో పులి కలకలం సృష్టించింది. ఆలయ పరిసరాల్లో పులి తిరుగుతోందని గ్రామస్థులు అటవీశాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆదివారం ఫారెస్ట్ అధికారులు పెద్దమ్మగుడి పరిసరాలను పరిశీలించారు.
ఇప్పటి నుంచి ఆలయ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుంటామని.. నిశితంగా పులి సంచారాన్ని గమనిస్తామని వారు తెలిపారు. భక్తులు సైతం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించాకే గుడి వద్దకు రావాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.