Lawyers Protest Nizamabad | జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన.. దాడి చేసిన వారిని అరెస్ట్​ చేయాలని డిమాండ్​

న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.

అక్షరటుడే,నిజామాబాద్ సిటీ : Lawyers Protest Nizamabad | న్యాయవాదిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని లాయర్లు డిమాండ్​ చేశారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ బార్​ అసోసియేషన్ (Nizamabad Bar Association) ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా చేశారు.

Lawyers Protest Nizamabad | మహిళా న్యాయవాదిపై దాడిని ఖండిస్తున్నాం..

ఈ సందర్భంగా న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షుడు జగన్​ మోహన్​ గౌడ్​ మాట్లాడుతూ బోధన్ బార్ అసోసియేషన్​లో (Bodhan Bar Association) ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది కళ్యాణిపై ఆదివారం రుద్రూర్​లో గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడిపై న్యాయవాది రుద్రూర్ పోలీస్ స్టేషన్​లో (Rudrur Police Station) వెంటనే ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం ఇంతవరకు దుండగులను అరెస్ట్ చేయకుండా ఉదాసీన వైఖరి అవలంభించడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి.

Lawyers Protest Nizamabad | వెంటనే అరెస్ట్​ చేయాలి..

మహిళా న్యాయవాదిపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలని వారు జగన్​ మోహన్​ గౌడ్​ కోరారు. కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను (Police Department) న్యాయవాది పరిషత్ డిమాండ్ చేస్తోందన్నారు. అనంతరం బోధన్​ బార్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ఉపాధ్యక్షుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది

Lakshman Rathod Award | లక్ష్మణ్ రాథోడ్​కు ఇండియన్ బెస్ట్ ఇన్​స్పిరేషన్​ అవార్డు

విద్యార్థులకు, క్రీడాకారులకు ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ.. వారి ఉన్నతికి విశేష కృషి చేస్తున్న జడ్పీహెచ్​ఎస్​ పేట్​సంగం పీఈటీ, బామన్​ నాయక్​ స్పోర్ట్స్​ ఫౌండేషన్​ వ్యవస్థాపకుడు లక్ష్మణ్​రాథోడ్​కు ఇండియన్​ బెస్ట్​ ఇన్​స్పిరేషన్ అవార్డు వరించింది.