అక్షరటుడే, ఇందూరు: Congress Health Wing | మహిళలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును కాపాడేందుకు కఠిన చర్యలు అవసరమని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ హెల్త్ స్టేట్ హెడ్ డాక్టర్ కవితా రెడ్డి (Dr. Kavitha Reddy) అన్నారు. సైబర్ నేరాలను అరికట్టేందుకు చట్టాలను మరింత బలపరచాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
Congress Health Wing | గాంధీభవన్లో రౌండ్ టేబుల్ సమావేశం..
మహిళలు ఎదుర్కొంటున్న సైబర్ బెదిరింపుల సమస్యపై గాంధీభవన్లో (Gandhi Bhavan) నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో డాక్టర్ కవితా రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ (in-charge Meenakshi Natarajan), బాలల హక్కుల కార్యకర్త శాంతా సిన్హా, ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
సోషల్ మీడియా వేదికగా..
ఈ సందర్భంగా డాక్టర్ కవితా రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా (social media platforms) మహిళలపై వేధింపులు పెరిగిపోయాయన్నారు. మహిళలపై బెదిరింపులు ప్రజాస్వామ్య విలువలకు తీవ్ర ప్రమాదంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత, అవగాహన కార్యక్రమాల విస్తరణ, డిజిటల్ ప్లాట్ఫాంల బాధ్యత, అలాగే ప్రభుత్వ పాత్రపై ఆమె కీలక సూచనలు చేశారు. సైబర్ బెదిరింపులను ఎదుర్కొనేందుకు సమష్టి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస సీనియర్ నాయకులు పాల్గొన్నారు.