అక్షరటుడే, వెబ్డెస్క్: Encounter | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack తో భారత్ అట్టుడుకుతోంది. ఎలాగైనా ఉగ్రమూకల అంతు చూడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా పర్యాటకు touristsలపై దాడి చేసిన ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉగ్రదాడికి పాల్పడిన తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు security forces ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ search operation చేపట్టాయి. మూడు రోజులుగా సాగుతున్న ఈ ఆపరేషన్లో భాగంగా ఇప్పటికే పలుమార్లు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి.
ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యల్లో బందిపొరా bandiporaలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ Lashkar-e-Taiba commander అల్తాఫ్ లల్లీని Altaf Lalli భారత సైన్యం అంతం చేసింది. సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదులు ఆదిల్ షేక్ adil shek, ఆసిఫ్ షేక్ రజీద్ asif shek rajeed ఇళ్లను బలగాలు పేల్చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులను అంతం చేసే వరకు కూంబింగ్ coombing చేపట్టనున్నట్లు సమాచారం.