అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mopal | మోపాల్ మండల పరిధిలో సోమవారం నార్కోటిక్ అధికారులు (Narcotics Police) దాడులు జరిపారు. నార్కోటిక్ ఇన్స్పెక్టర్ పూర్ణేశ్వర్ ప్రత్యేక టీం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన దాడుల్లో భారీగా అల్ప్రాజోలం (Alfrazolam) పట్టుకున్నారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్నగర్కు (Vinayak Nagar) చెందిన సాగర్ గౌడ్, ప్రవీణ్ గౌడ్లు మోపాల్ మండలానికి వెళ్తుండగా.. పక్కా సమాచారం మేరకు మోపాల్ మండలంలోని తాడెం వద్ద నార్కోటిక్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5 లక్షల విలువైన 500 గ్రాముల అల్ఫ్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ నిమిత్తం మోపాల్ ఎస్సైకి అప్పజెప్పినట్లు వివరించారు.
Mopal | యథేచ్ఛగా మత్తు పదార్థాల సరఫరా
జిల్లా పరిధిలో మత్తు పదార్థాల సరఫరా యథేచ్ఛగా సాగుతోంది. నిజామాబాద్ మండల పరిధిలో ఇదివరకు నార్కోటిక్ పోలీసులు దాడులు జరిపి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ మండల పరిధిలోని గుండారంలో (Gundaram) ఓ కల్లుడిపోపై దాడిచేసి 600 గ్రాముల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ సోమవారం సైతం మోపాల్ మండల పరిధిలో దాడులు జరిగాయి. దీనిని బట్టి చేస్తే మత్తుపదార్థాల సరఫరా అనేది నిజామాబాద్ సిటీ, మండల పరిధుల్లో యథేచ్ఛగా సాగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
