అక్షరటుడే నిజామాబాద్ సిటీ : CP Sai Chaitanya | జిల్లా పోలీసులు భారీ మొత్తంలో అల్ప్రాజోలం పట్టుకొని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీపీ శుక్రవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. బోధన్ మండలం సాలూర గ్రామం హనుమాన్ టెంపుల్ దగ్గర రూ.25 లక్షల విలువైన 2.5 కేజీల అల్ప్రాజోలం, స్కోడా కారు, 8 సెల్ఫోన్లు, రూ.2.5 లక్షల నగదు పోలీసులు గురువారం అర్ధరాత్రి స్వాధీనం చేసుకున్నారు.
అల్ప్రాజోలం తరలిస్తున్న మహారాష్ట్రలోని నంద్ గోవాన్ సతారాకు చెందిన అమర్ సింగ్ దేశముఖ్, పూణేలోని చించ్వాడ్ స్టేషన్కు చెందిన బాబు రావు బస్వరాజ్ కాడేరి అలియాస్ ప్రసాద్ కాడేరి, పరమేశ్వర్ విజయ్ బర్దాడే, ఉమర్గా తాలూకా గుంజేటి ప్రాంతానికి చెందిన షబ్బీర్ అలీ పాషామియ, నిజామాబాద్ సాయి నగర్కు చెందిన మల్లెపూల లక్ష్మణ్ గౌడ్ను అరెస్టు చేశారు. మరో నిందితుడు మహారాష్ట్రకు చెందిన విశ్వనాథ్ శిపంకర్ పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు.
గురువారం రాత్రి నిందితులు మల్లెపూల లక్ష్మణ్ గౌడ్కు అల్ప్రాజోలం విక్రయించడానికి వచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి వారిని పట్టుకున్నట్లు సీపీ తెలిపారు.