HomeజాతీయంLand Scam | రూ.200 కోట్ల భూమి రూ.3 కోట్లకు కొనుగోలు.. మహారాష్ట్రలో భారీ భూ...

Land Scam | రూ.200 కోట్ల భూమి రూ.3 కోట్లకు కొనుగోలు.. మహారాష్ట్రలో భారీ భూ కుంభకోణం!

మహారాష్ట్ర రాజకీయాలను భూ కుంభకోణాల ఆరోపణలు కుదిపేస్తున్నాయి. మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకే దక్కించుకున్నాడని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Land Scam | మహారాష్ట్ర రాజకీయాలను భూ కుంభకోణాల ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​ (Ajit Pawar) కుమారుడు రూ.1,800 కోట్ల విలువైన భూమిని తక్కువ ధరకు దక్కించుకున్నాడని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా మరో మంత్రి సైతం రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.3 కోట్లకే దక్కించుకున్నాడని కాంగ్రెస్​ నాయకులు (Congress Leaders) ఆరోపించారు.

రాష్ట్ర మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ (State Minister Pratap Sarnaik) రూ.3 కోట్లకే రూ.200 కోట్ల విలువైన భూమిని దక్కించుకున్నట్లు కాంగ్రెస్​ నాయకుడు విజయ్‌ వడెట్టివార్‌ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. నాలుగు ఎకరాల భూమిని మంత్రి రూ.3 కోట్లకే కొనుగోలు చేశారన్నారు. కానీ సదరు భూమి విలువ బహిరంగ మార్కెట్​లో రూ.200 కోట్ల వరకు ఉంటుందన్నారు. ఆ భూమిలో మంత్రి విద్యాసంస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. దీనిపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్‌ బవాంకులే మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Land Scam | అజిత్​ పవార్​ కుమారుడిపై..

అజిత్‌ పవార్‌ కుమారుడు పార్థ్‌ పవార్‌ (Parth Pawar)కు చెందిన అమెడియా ఎంటర్‌ప్రైజెస్‌కు రూ.18 వందల కోట్ల విలువైన భూమిని రూ.300 కోట్లకే విక్రయించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ భూ కుంభకోణంపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (Inspector General of Registration) రూ.1,800 కోట్ల ఆస్తి లావాదేవీలో జరిగిన తీవ్రమైన అవకతవకలను వివరిస్తూ మధ్యంతర నివేదికను సమర్పించింది. ముంబైలోని అదనపు ప్రధాన కార్యదర్శికి పంపిన నివేదిక, పూణేలోని ముంధ్వా ప్రాంతంలో ప్రభుత్వ-సంబంధిత భూమి అమ్మకం, రిజిస్ట్రేషన్‌లో లోపాలు జరిగినట్లు పేర్కొంది. దీంతో ఓ అధికారిని ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్​ చేసింది.

Must Read
Related News