Homeతాజావార్తలుKokapet Lands | ముగిసిన భూముల వేలం ప్రక్రియ.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం

Kokapet Lands | ముగిసిన భూముల వేలం ప్రక్రియ.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం

కోకాపేటలోని భూములకు నిర్వహించిన వేలం ప్రక్రియ ముగిసింది. నాలుగు విడతల్లో ప్రభుత్వానికి రూ.3,862.8 కోట్ల ఆదాయం వచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kokapet Lands | రాష్ట్ర ప్రభుత్వం హెచ్​ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో నగరంలోని పలు భూములకు ఆన్​లైన్​ వేలం (online auction) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేలం పాట శుక్రవారంతో ముగిసింది. మొత్తం నాలుగు దశల్లో వేలం పాట జరగ్గా ప్రభుత్వానికి రూ.3,862.8 కోట్ల ఆదాయం సమకూరింది.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలోని నియోపాలిస్​ భూములకు (Neopolis lands) ప్రభుత్వం మూడు విడుతల్లో వేలం నిర్వహించింది. తాజాగా శుక్రవారం గోల్డ్ మైల్​ భూములను (Gold Mile lands) వేలం వేసింది. 1.98 ఎకరాలను COEUS ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దక్కించుకుంది. ఆ కంపెనీ ఎకరానికి రూ.77.75 కోట్లకు పాడింది. దీంతో రూ.154 కోట్ల ఆదాయం వచ్చింది.

Kokapet Lands | హాట్​కేకుల్లా..

కోకాపేట భూములు (Kokapet Lands) హాట్​ కేక్​ల్లా అమ్ముడు పోతున్నాయి. కోట్లు పెట్టి ఇక్కడ భూమిని కొనుగోలు చేయడానికి సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మొదటి విడతలో నవంబర్​ 24న ప్లాట్‌ నంబర్‌ 17, 18లోని భూములకు ప్రభుత్వం వేలం వేసింది. ప్లాట్‌ నం.17లోని భూమి ఎకరం ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. 18లో 5.31 ఎకరాల భూమి ఉంది. మొత్తం 9.9 ఎకరాలకు 1,355.33 కోట్లు ధర పలికింది.

నవంబర్​ 28న రెండో దశ వేలం నిర్వహించారు. ప్లాట్​ నంబర్​ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు జీహెచ్​ఆర్​ సంస్థ దక్కించుకుంది. 16వ ఎకరాకు రూ.147.75 కోట్లకు చొప్పున గోద్రెజ్​ సంస్థ కొనుగోలు చేసింది. మూడో విడత డిసెంబర్​ 3న జరిగింది. ప్లాట్ నెంబర్ 19లో ఎకరా రూ.131 కోట్ల చొప్పున యులా కన్స్ట్రక్షన్స్ & గ్లోబస్ ఇన్‌ఫ్రాకాన్‌ దక్కించుకుంది. ప్లాట్ నెంబర్ 20లో ఎకరా రూ.118 కోట్ల చొప్పున బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్‌ (Brigade Enterprises) వేలం పాడింది.

Kokapet Lands | మూసాపేటలో వాయిదా

మూసాపేటలోని వై జంక్షన్​ (Y junction in Moosapet) సమీపంలో 15 ఎకరాలకు శుక్రవారం వేలం జరగాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు గతంలో వివరాలు వెల్లడించారు. ప్లాట్​ నంబర్​ 1లో 11.48 ఎకరాలు, ప్లాట్​ నంబర్​ 2లో 3.18 ఎకరాలకు ఆన్​లైన్​ ఆక్షన్​ నిర్వహిస్తామని చెప్పారు. పరిపాలన కారణాలతో ఈ వేలం ప్రక్రియను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు.

Must Read
Related News