ePaper
More
    HomeజాతీయంSupreme Court | ఈసీ, పార్టీల మధ్య లోపించిన విశ్వాసం.. ఇది దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు

    Supreme Court | ఈసీ, పార్టీల మధ్య లోపించిన విశ్వాసం.. ఇది దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య పరస్పర విశ్వాసం లోపించిందని, ఇది దురదృష్టకరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బీహార్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision)ను పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది.

    స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు గడువు పెంచాలన్న పిటిషనర్ల అభ్యర్థనను సుప్రీంకోర్టు(Supreme Court) తిరస్కరించింది. గడువును పొడిగించడం వల్ల అంతులేని ప్రక్రియ ఏర్పడుతుందని, నిబంధనల ప్రకారం నిర్ణయించిన మొత్తం షెడ్యూల్ను పట్టాలు తప్పే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈసీ జారీ చేసిన నోట్ పై తమ ప్రతిస్పందనలను సమర్పించడానికి రాజకీయ పార్టీలకు అనుమతించింది.
    ఓటర్లు, రాజకీయ పార్టీలు క్లెయిమ్లు, అభ్యంతరాలను దాఖలు చేయడంలో సహాయం చేయడానికి పారా-లీగల్ వాలంటీర్లను నియమించాలని అత్యున్నత న్యాయస్థానం బీహార్ లీగల్ సర్వీస్ అథారిటీ(Bihar Legal Service Authority)ని ఆదేశించింది.

    Supreme Court | గడువు తర్వాత కూడా అనుమతి..

    విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిణామాలు, గత విచారణ నాటి పరిస్థితులను బట్టి ఎన్నికల సంఘం(Election Commission), రాజకీయ పార్టీ(Political Parties)ల మధ్య విశ్వాసం లోపించినట్లు కనిపిస్తోందని తెలిపింది. బీహార్ SIRపై గందరగోళం తీవ్ర విశ్వసనీయమైన సమస్య’అని పేర్కొన్న ధర్మాసనం రాజకీయ పార్టీలు తమను తాము ‘యాక్టివేట్’ చేసుకోవాలని హితవు పలికింది. అయితే, బీహార్లో ముసాయిదా ఓటర్ల జాబితాకు సంబంధించిన వాదనలు, అభ్యంతరాలు, దిద్దుబాట్లను సెప్టెంబర్ 1 గడువు తర్వాత అనుమతిస్తామని ఎన్నికల సంఘం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు తెలిపింది. పత్రాలు అసంపూర్ణంగా ఉన్న ఓటర్లకు 7 రోజుల్లోపు నోటీసులు జారీ చేయడం నిరంతర ప్రక్రయిన అని పేర్కొంది. బీహార్ SIR లో మొత్తం 2.74 కోట్ల మంది డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మొత్తం 99.5 శాతం మంది అర్హత పత్రాలను దాఖలు చేశారని పేర్కొంది.

    Supreme Court | తొలగింపునకు నాలుగు కారణాలు

    ఓటరు జాబితా నుంచి పేర్లను తొలగించడానికి ఈసీ నాలుగు ప్రధాన కారణాలను పేర్కొంది. 25 లక్షల మంది వలస వెళ్లినట్లు గుర్తించి తొలగించామని, అలాగే, 22 లక్షల మంది మరణించినట్లు గుర్తించి తొలగించినట్లు తెలిపింది. 9.7 లక్షల మంది ఆయా చిరునామాలలో లేరని తెలిపింది. 7 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలలో నమోదు చేసుకున్నందుకు తొలగించినట్లు వివరించింది.

    Latest articles

    Nizamabad | బార్‌ నిర్వాహకులతో ఇబ్బంది అవుతోందని కలెక్టర్‌కు ఫిర్యాదు

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నగరంలోని ఇస్కాన్‌ మందిరం సమీపంలో తన ఇంటిపక్కన అమృత బార్‌ నిర్వాహకులతో...

    Nizamabad City | లయన్స్‌ ఆధ్వర్యంలో పోషకాహార దినోత్సవం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కంటేశ్వర్‌లోని గుర్బాబాది...

    Armoor Town | రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతతో బీసీలకు న్యాయం

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Armoor Town | రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని బీసీ...

    Kamareddy SP | అందరి సహకారంతోనే సాధారణ స్థితికి..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | గతంలో ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో భారీ వరదలు (Heavy Floods) బీభత్సం...

    More like this

    Nizamabad | బార్‌ నిర్వాహకులతో ఇబ్బంది అవుతోందని కలెక్టర్‌కు ఫిర్యాదు

    అక్షరటుడే, ఇందూరు : Nizamabad | నగరంలోని ఇస్కాన్‌ మందిరం సమీపంలో తన ఇంటిపక్కన అమృత బార్‌ నిర్వాహకులతో...

    Nizamabad City | లయన్స్‌ ఆధ్వర్యంలో పోషకాహార దినోత్సవం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని కంటేశ్వర్‌లోని గుర్బాబాది...

    Armoor Town | రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేతతో బీసీలకు న్యాయం

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Armoor Town | రిజర్వేషన్‌ పరిమితిని ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని బీసీ...