ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిGovernment Schools| బడులకు భద్రత కరువు

    Government Schools| బడులకు భద్రత కరువు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Government Schools| ప్రభుత్వ పాఠశాలల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రహరీల్లేని పాఠశాలలను దొంగలు టార్గెట్​ చేస్తున్నారు. విలువైన సామాగ్రి ఉన్న గదులను పగులగొట్టి వాటిని ఎత్తుకెళ్తున్నారు. జిల్లా వాప్తంగా స్కూళ్లకు రక్షణ వ్యవస్థ లేకపోవడంతో యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి.

    ప్రహరీల్లేని పాఠశాలలు..

    చాలావరకు ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. దీంతో రాత్రయితే దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఆకతాయిలు సైతం ప్రభుత్వ బడులను అసాంఘిక కార్యకలాపాలకు (Anti-social activities) అడ్డాలుగా మార్చేశారు. దీంతో పాఠశాల సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. చోరీకి గురైతే వస్తువులను సమకూర్చుకోవడం స్కూల్​ ఇన్​ఛార్జీలకు ఇబ్బందికరంగా మారుతోంది. పాఠశాలలకు వచ్చే తక్కువ గ్రాంట్​తో నిర్వహణ ఖర్చుకు అవస్థలు పడుతుంటే అపహరణకు గురైన వస్తువులు కొనేందుకు ఖర్చు మరింత పెరుగుతుంది.

    READ ALSO  cyber fraud | ముద్ర లోన్ పేరుతో సైబర్ మోసం..

    జిల్లావ్యాప్తంగా..

    జిల్లావ్యాప్తంగా 1,115 ప్రభుత్వ పాఠశాలున్నాయి. 183 ఉన్నత పాఠశాలలున్నాయి. జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులున్నాయి. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేయించారు. దొంగతనాలు జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ రక్షణ లేని పరిస్థితి నెలకొంది. వర్ని మండలం చింతల్ పేట్ తండాలో ఫిబ్రవరిలో ప్రాథమిక పాఠశాల తలుపులు ధ్వంసం చేశారు. బీరువాను పగులగొట్టి దుండగులు చోరీకి యత్నించారు. టీవీ, ఫర్నిచర్​ను పగులగొట్టారు. ఇలా పలు పాఠశాలల్లో రక్షణ వ్యవస్థ లేక దొంగతనాలు జరుగుతున్నాయి.

    విలువైన సామాగ్రి అపహరణ..

    ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, ఆర్వో ప్లాంట్లు, ఫ్యాన్లు, వంట సామాగ్రి ఉంటాయి. అమ్మ ఆదర్శ కమిటీలు (Amma Adarsha​​Committees) పాఠశాలలపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలతో పాఠశాలలకు భద్రత ఏర్పాటు చేయిస్తే చోరీలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.

    READ ALSO  Kamareddy | అన్నదాత భూమి కబ్జా.. ఆందోళనతో ఆత్మహత్య

    Latest articles

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...

    Samagra Siksha | సమగ్ర శిక్ష ఉద్యోగులను బదిలీ చేయాలి

    అక్షరటుడే, కామారెడ్డి: Samagra Siksha | సమగ్రశిక్షలో ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని సమగ్ర...

    More like this

    Sirikonda | అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

    అక్షరటుడే, ఇందల్వాయి: Sirikonda | సిరికొండ మండలంలోని మైలారం శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు....

    Bharosa Center | మహిళలు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bharosa Center | బాధిత మహిళలకు, పిల్లలకు అండగా భరోసా కేంద్రం పనిచేస్తుందని సీపీ...

    Case on PAYTM | పేటీఎంపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Case on PAYTM | ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల కంపెనీ పేటీఎం (paytm), దాని...