అక్షరటుడే, ఎల్లారెడ్డి:Operation Sindoor | ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత సైన్యం(Indian Army) నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’(Operation Sindoor)కు తాము పూర్తి మద్దతిస్తున్నామని ఉపాధి కూలీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి పనుల వద్ద జాతీయ జెండాలను ప్రదర్శించారు. అనంతరం పహల్లామ్ దాడి(Pahalgam Attack)లో మృతి చెందిన పర్యాటకులకు శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఉప సర్పంచ్ గోనె శ్రీకాంత్, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ భాగయ్య మాట్లాడుతూ అమాయకులైన యాత్రికులపై పాకిస్తాన్ ఉగ్రముకలు దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ విజయంపై వారు హర్షం వ్యక్తం చేశారు.
