Homeఆంధప్రదేశ్Kurnool Bus Accident | కర్నూల్​ బస్సు ప్రమాదం.. వైరల్​గా మారిన బైకర్​ శివశంకర్​ వీడియో

Kurnool Bus Accident | కర్నూల్​ బస్సు ప్రమాదం.. వైరల్​గా మారిన బైకర్​ శివశంకర్​ వీడియో

కర్నూల్ బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్​ శివశంకర్​ వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ప్రమాదానికి ముందు ఆయన ఓ పెట్రోల్ బంక్​కు వెళ్లాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kurnool Bus Accident | కర్నూల్​ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు బైక్​ను ఢీకొనడంతో మంటలు చెలరేగి 20 మంది సజీవ దహనం అయ్యారు.

హైదరాబాద్​ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్​ బస్సు (Kaveri Travels Bus) కర్నూల్​ జిల్లా చిన్నటేకూర్​ సమీపంలో దగ్ధం అయిన విషయం విధితమే. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూల్​ మండలం (Kurnool Mandal) ప్రజానగర్​కు చెందిన శివశంకర్​ బైక్​పై రాంగ్​రూట్​లో రావడం, బస్సు దానిని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బైక్​ బస్సు కిందకు దూసుకుపోవడంతో మంటలు చెలరేగి 20 మంది చనిపోయారు. ఈ ఘటనలో బైక్​ మీదున్న శివశంకర్​ సైతం తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయాడు.

Kurnool Bus Accident | అర్ధరాత్రి ర్యాష్​ డ్రైవింగ్​

ప్రమాదానికి ముందు శివశంకర్​ ఓ పెట్రోల్​ బంక్​ (Petrol Bunk)లోకి వెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్​గా మారింది. రాత్రి 2:23 గంటలకు శివశంకర్​ మరో వ్యక్తితో కలిసి పెట్రోల్ బంక్​లోకి వెళ్లాడు. అక్కడ ఎవరు లేకపోవడంతో కొద్ది సేపు అటు ఇటు తిరిగాడు. అయితే ఆ సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నట్లు వీడియోలో చూస్తే అర్థం అవుతోంది. అంతేగాకుండా పెట్రోల్​ బంక్​ నుంచి వెళ్లే సమయంలో సైతం ఆయన బైక్​ను అతివేగంగా నడిపాడు. దీంతో స్కిడ్​ అయింది. అయితే ఆ వీడియోలో ఉన్న మరో వ్యక్తి ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన లేరు.