Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | కేటీఆర్​వి చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్​

Nizamabad City | కేటీఆర్​వి చవకబారు రాజకీయాలు: పీసీసీ చీఫ్​

బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​పై పీసీసీ చీఫ్​, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్ మండిపడ్డారు.​ చౌకబారు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | బీఆర్​ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చవకబారు రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్​, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) మండిపడ్డారు. కాంగ్రెస్​ అధికారంలోకి ఎన్నో కార్యక్రమాలు చేసి చూపిస్తున్నామని తెలిపారు. కానీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై కేటీఆర్​ (KTR) ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారన్నారు.

కేటీఆర్​వి పస లేని ఆరోపణలని కొట్టిపడేశారు. ఆయన గురువారం నిజామాబాద్​లో విలేకరులతో మాట్లాడారు. బీఆర్​ఎస్​ను తెలంగాణ ప్రజలు దూరం పెట్టారన్నారు. పదేళ్ల బీఆర్​ఎస్​ నిరంకుశ పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పార్టీని భవిష్యత్తులోనూ ఆదరించే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. కుటుంబంలోని తగాదాలను పరిష్కరించుకోలేని కేటీఆర్​ కాంగ్రెస్​పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చవకబారు రాజకీయాలు (cheap politics) చేయడం మానుకోవాలని హితవు పలికారు.

Nizamabad City | జూబ్లీహిల్స్​ కాంగ్రెస్​దే విజయం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలువబోతోందని పీసీసీ చీఫ్​ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన పనులపై ప్రజలు సంతృప్తితో ఉన్నారన్నారు.

Nizamabad City | ఎవరు పాదయాత్ర చేసినా స్వాగతిస్తాం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Telangana Jagruti president Kavitha) పాదయాత్రపై మహేశ్​ కుమార్​ గౌడ్​ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పాదయాత్రలు చేసినా స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్రను చేయడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని దండుపాళ్యం ముఠా దోచుకుందంటూ కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్​ జవాబు చెప్పాలని ప్రశ్నించారు. అయితే.. గత పదేళ్లలో తెలంగాణాను దోచుకున్న ముఠాలో కవిత సభ్యురాలు కాదా చెప్పాలన్నారు.

Nizamabad City | తెలంగాణలో టెంపుల్ కారిడార్

తెలంగాణలో రూ. 380 కోట్లతో టెంపుల్ కారిడార్ రోడ్డు కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పీసీసీ చీఫ్​, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. టెంపుల్​ కారిడార్​ నిర్మాణం అయితే ఆలయాలు అభివృద్ధి చెందుతాయన్నారు.

Nizamabad City | పెండింగ్​లో కేంద్ర నిధులు

ఆర్వోబీల నిర్మాణం విషయంపై పీసీసీ చీఫ్​ స్పందించారు. పనుల విషయంలో రాష్ట్ర నిధులే కాదు కేంద్ర నిధులు (central funds) కూడా పెండింగ్​లో ఉన్నాయని తెలిపారు. ఇక నిజామాబాద్​ జిల్లాను పారిశ్రామిక పరంగా అభివృద్ధి చేసేందుకు పామాయల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. జిల్లా ప్రజల 35 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటును నెరవేర్చామని చెప్పారు.