KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను బయటపెడతాం: కేటీఆర్​

బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో ఆగారు.

అక్షరటుడే, ఆర్మూర్ : KTR BRS Statement | బీఆర్​ఎస్​ అధికారంలోకి రాగానే కాంగ్రెస్​ అరాచకాలను ఒక్కొక్కటిగా బయటపెడతామని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. హైదరాబాద్​ నుంచి ఆదిలాబాద్​ వెళ్తూ ఆర్మూర్​లో (Armoor)​ ఆగారు.

KTR BRS Statement | రాబోయేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే..

ఈ సందర్భంగా ఆర్మూర్​లో ఆగిన కేటీఆర్​ను (KTR) బీఆర్​ఎస్​ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ (Tealangana) ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పెంచిన పెన్షన్​లను వెంటనే విడుదల చేయాలని అదే విధంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. రుణమాఫీ అందజేయాలని రైతులకు అడిగితే బీఆర్ఎస్ నాయకులను (BRS Ledaers) అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, పార్టీ కౌన్సిలర్లు గుంజులు పృథ్వి, నదీం, అజీం, సీనియర్ నాయకులు పోల సుధాకర్, మహేష్, ఎంజె రాము జనపల్లి రంజిత్, రోహిత్ ప్రవీణ్ గౌడ్, షరీఫ్ సత్తార్, ఇనేక్ ఫాల్ బబ్లు, మట్టెల ప్రవీణ్, మోహన్, జీజీ రామ్, మెట్టు సంతోష్, సుధాకర్, వేణు, కళ్యాణ్, ఇంతియాజ్ పాల్గొన్నారు.

Related articles

Kamareddy Education Demand | కామారెడ్డిలో విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టండి.. విద్యార్థి సంఘాల సూచన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.

Mudhiraj Mahasabha Appointment | రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ ఇన్​ఛార్జీగా మంత్రి గణేష్ నియామకం

తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ బాన్సువాడ నియోజకవర్గ ఇన్​ఛార్జీగా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామానికి చెందిన మంత్రి గణేష్ నియమితులయ్యారు. ఆయనకు మంగళవారం నియామకపత్రం అందజేశారు.

AI Summit Protest | ఏఐ సదస్సులో ఆందోళన ఘటన.. ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి అరెస్ట్‌

ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో యూత్‌ కాంగ్రెస్ నేతలు చొక్కాలు విప్పి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది