Homeతాజావార్తలుKonda Surekha | కేబినెట్​ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా.. చర్చనీయాంశమైన గైర్హాజరు

Konda Surekha | కేబినెట్​ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా.. చర్చనీయాంశమైన గైర్హాజరు

వరుస వివాదాలతో మంత్రి కొండా సురేఖ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ ​టాపిక్​గా మారారు. తాజాగా గురువారం కేబినెట్​ మీటింగ్​కు ఆమె గైర్హాజరవడం సర్వత్రా చర్చకు దారి తీసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Konda Surekha | మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి కొండా సురేఖ తీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతోంది. ఆమె పార్టీలో ప్రవర్తిస్తున్న తీరు కారణంగా అటు ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్​ పార్టీ (Congress Party) ఇరకాటంలో పడుతున్నాయి.

తాజాగా గురువారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరు కావడం పార్టీలో మరింత చర్చనీయాంశమైంది. కేబినెట్​ మీటింగ్​కు (Cabinet Meeting) ముందు.. ఆమె డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. అనంతరం ఆమె సచివాలయంలో మీటింగ్​లో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయారు.

Konda Surekha | ఆది నుంచి వివాదాస్పద వైఖరి..

గతంలో ఓ హీరోయిన్​ విషయంలో కొండా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆమె భర్త కొండా మురళి (Konda Murali) సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఆరోపణలు చేశారు. దీంతో వరంగల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఇప్పటికే కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకం అయ్యారు. ఇటీవల ఆమె భర్త మురళి పొంగులేటిపై హైకమాండ్​కు ఫిర్యాదు చేయడంతో వార్తల్లో నిలిచారు.

కాగా.. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇంటికి వచ్చిన టాస్క్​ఫోర్స్​ పోలీసులను మంత్రి కుమార్తె సుష్మిత అడ్డుకున్నారు. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్​ను ప్రభుత్వం ఇటీవల తొలగించారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సుమంత్​ మంత్రి ఇంట్లో ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్​ చేయడానికి వెళ్లారు. వారిని గేటు వద్దే మంత్రి కుమార్తె అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాశమైంది. ఇలా తరచూ తలెత్తుతున్న వివాదాలు కాంగ్రెస్​ పార్టీకి తలనొప్పిగా మారాయి.