Homeజిల్లాలునిజామాబాద్​Konda Laxman Bapuji | ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Konda Laxman Bapuji | ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Konda Laxman Bapuji | స్వాతంత్య్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఉమ్మడి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన అలుపెరుగని పోరాటాలు చేశారని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు.

Konda Laxman Bapuji | ఆయుష్ విభాగం​ ఆధ్వర్యంలో..

నిజామాబాద్​ జిల్లా ఆయుష్ (AYUSH Nizamabad)​ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జీజీహెచ్​లో (GGh Nizamabad) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి జిల్లా ఆయుష్ విభాగం ఇన్​ఛార్జి డాక్టర్ జె గంగాదాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యోగా వైద్యుడు తిరుపతి, ఆయుష్ విభాగం ఫార్మసిస్ట్​లు న్యావనంది పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, టీబీ విభాగం ఉద్యోగులు, డయాలసిస్ కేంద్రం ఉద్యోగులు పాల్గొన్నారు.

Konda Laxman Bapuji | జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..

నిజామాబాద్​ జిల్లా పద్మశాలి సంఘం (Padmashali sangham Nizamabad) ఆధ్వర్యంలో వినాయక్ నగర్​లోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఏర్పాటు కోసం చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మైసల నారాయణ, ఉపాధ్యక్షులు గాలిపల్లి నారాయణ, సహాయ కార్యదర్శి పద్మ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

కొండా లక్ష్మణ్​ బాపూజీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు

Must Read
Related News