అక్షరటుడే, వెబ్డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్లో ఆదివారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదులకు జైషే మహమ్మద్తో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కమాండర్ సైఫుల్లాతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు ఆపరేషన్ ట్రాషి-I (Operation Trashi-I) కింద కిష్త్వార్ ప్రాంతంలో బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
Kishtwar Encounter Operation | మోస్ట్వాంటెండ్ టెర్రరిస్ట్
ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాదులు పాక్కు చెందిన వారుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ఒక మట్టిహౌస్ లోపల దాక్కున్నారని, పర్వత ప్రాంతాలకు చేరుకున్న బలగాలపై కాల్పులు జరపడంతో తీవ్ర కాల్పులు జరిగాయని తెలిపారు. అక్కడ ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఎన్కౌంటర్లో చనిపోయిన సైఫుల్లా (Saifullah) మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. గతంలో దాదాపు 20 సార్లు తప్పించుకున్న అతడు తాజాగా చనిపోయాడు.
Kishtwar Encounter Operation | గాయపడ్డ శునకం
కిష్త్వార్లోని చత్రో ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లో భారత సైన్యం 2 పారా స్పెషల్ ఫోర్సెస్కు చెందిన కె9 ట్రూపర్ టైసన్ (శునకం) గాయపడింది. జర్మన్ షెపర్డ్ ఉగ్రవాదుల స్థావరం (ధోక్) వైపు మొట్టమొదట దాడి చేసింది. కాల్పుల సమయంలో బుల్లెట్ గాయపడింది. కాల్పులు జరిపినప్పటికీ, టైసన్ విధి నిర్వహణలో అసాధారణ ధైర్యం, విధేయతను ప్రదర్శిస్తూ ముందుకు సాగిందని అధికారులు తెలిపారు. అనంతరం గాయపడిన శునకాన్ని హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు.
