Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదులకు జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కమాండర్ సైఫుల్లాతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు ఆపరేషన్ ట్రాషి-I (Operation Trashi-I) […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. ఉగ్రవాదులకు జైషే మహమ్మద్‌తో సంబంధం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

జమ్మూ కశ్మీర్‌ (Jammu and Kashmir)లోని కిష్త్వార్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఆదివారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం) కమాండర్ సైఫుల్లాతో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు ఆపరేషన్ ట్రాషి-I (Operation Trashi-I) కింద కిష్త్వార్ ప్రాంతంలో బలగాలు కూంబింగ్​ చేపట్టాయి. ఈ క్రమంలో ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు టెర్రరిస్టులు చనిపోయారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

Kishtwar Encounter Operation | మోస్ట్​వాంటెండ్​ టెర్రరిస్ట్​

ఎన్​కౌంటర్​లో హతమైన ఉగ్రవాదులు పాక్​కు చెందిన వారుగా అధికారులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ఒక మట్టిహౌస్ లోపల దాక్కున్నారని, పర్వత ప్రాంతాలకు చేరుకున్న బలగాలపై కాల్పులు జరపడంతో తీవ్ర కాల్పులు జరిగాయని తెలిపారు. అక్కడ ఇంకా సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. కాగా ఈ ఎన్​కౌంటర్​లో చనిపోయిన సైఫుల్లా (Saifullah) మోస్ట్​ వాంటెడ్​ టెర్రరిస్ట్​. గతంలో దాదాపు 20 సార్లు తప్పించుకున్న అతడు తాజాగా చనిపోయాడు.

Kishtwar Encounter Operation | గాయపడ్డ శునకం

కిష్త్వార్‌లోని చత్రో ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్‌లో భారత సైన్యం 2 పారా స్పెషల్ ఫోర్సెస్‌కు చెందిన కె9 ట్రూపర్ టైసన్ (శునకం) గాయపడింది. జర్మన్ షెపర్డ్ ఉగ్రవాదుల స్థావరం (ధోక్) వైపు మొట్టమొదట దాడి చేసింది. కాల్పుల సమయంలో బుల్లెట్ గాయపడింది. కాల్పులు జరిపినప్పటికీ, టైసన్ విధి నిర్వహణలో అసాధారణ ధైర్యం, విధేయతను ప్రదర్శిస్తూ ముందుకు సాగిందని అధికారులు తెలిపారు. అనంతరం గాయపడిన శునకాన్ని హెలికాప్టర్​లో ఆస్పత్రికి తరలించారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ ఠాణాగా మార్చాలని నిర్ణయించింది.

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.