Human Rights Committee Kamareddy | టూరిస్టులను హతమార్చడం.. మానవహక్కులను భంగం కలిగించడమే..
Human Rights Committee Kamareddy | టూరిస్టులను హతమార్చడం.. మానవహక్కులను భంగం కలిగించడమే..

అక్షరటుడే, కామారెడ్డి:Human Rights Committee Kamareddy | టూరిస్టు(Tourist)లను హతమార్చడమంటే మానవ హక్కులను భంగం కలిగించినట్లేనని జాతీయ మానవ హక్కుల కమిటీ కామారెడ్డి జిల్లా కమిటీ పేర్కొంది. గురువారం ఆర్​అంబ్​బీ గెస్ట్​హౌస్(R&B Guesthouse)​లో విలేకరులతో కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కమిటీ జిల్లా ఛైర్మన్ విజయ భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి కటికం రాజిరెడ్డి మాట్లాడుతూ.. కొద్ది రోజుల క్రితం పహల్గామ్​(Pahalgam)లో భారతీయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదం(Terrorists)పై భారత్​ ఉక్కుపాదం మోపాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్​హెచ్​ఆర్​సీ జిల్లా కన్వీనర్​ రవీందర్​ రెడ్డి, జిల్లా మీడియా ఇన్​ఛార్జి సంకి నారాయణ, రాజంపేట మండల ఛైర్మన్​ నాగభూషణం, పాల్వంచ మండల ఛైర్మన్​ అంబాల రవి పేర్కొన్నారు.