ePaper
More
    Homeబిజినెస్​Starlink | స్టార్​ లింక్​ సేవలపై కీలక అప్​డేట్​.. ఆధార్​తో వినియోగదారుల వెరిఫికేషన్

    Starlink | స్టార్​ లింక్​ సేవలపై కీలక అప్​డేట్​.. ఆధార్​తో వినియోగదారుల వెరిఫికేషన్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Starlink | ప్రపంచ కుబేరుడు, అమెరికా వ్యాపారవేత్త ఎలన్​మస్క్(Elon Musk)​ తన స్టార్​లింక్​ ఇంటర్​నెట్​ సేవలను భారత్​లో ప్రారంభించనున్న విషయం తెలిసిందే. టవర్లు, కేబుల్స్​ అవసరం లేకుండా నేరుగా శాటిలైట్​ నుంచి ఇంటర్​నెట్​ అందించడం దీని ప్రత్యేకత.

    ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో స్టార్​లింక్​ సేవలు(Starlink Services) అందుబాటులో ఉన్నాయి. భారత్​లో త్వరలో కంపెనీ తన సేవలను ప్రారంభించనుంది. ఈ క్రమంలో వినియోగదారుల రిజిస్ట్రేషన్​ సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది. నేరుగా ఆన్​లైన్​లో అప్లై చేసుకుంటే ఇన్​స్టాలేషన్​ చేసి సేవలు అందించనుంది. వినియోగదారుల వెరిఫికేషన్​ కోసం ఆధార్​ ఐడెంటిఫికేషన్(Aadhaar Identification)​ను కంపెనీ వినియోగించుకోనుంది.

    Starlink | కుదిరిన ఒప్పందం

    ఇప్పటికే దేశంలో చాలా వాటికి ఆధార్​ తప్పనిసరి. దీంతో ఆధార్​ అథెంటికేషన్​తో స్టార్​లింక్​ సేవలు అందజేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల యూఐఏడీఐ(UIDAI)తో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో వినియోగదారులకు త్వరిత, సురక్షితమైన KYC పూర్తవుతుందని కంపెనీ ప్రకటించింది. కాగితపు పని లేకుండా హై-స్పీడ్ శాటిలైట్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని చెప్పింది. ఆధార్ e-KYCని సమగ్రపరచడం ద్వారా, స్టార్‌లింక్ గృహాలు, వ్యాపార సంస్థలకు సులభంగా సేవలు అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

    Starlink | వేగవంతమైన సేవల కోసం..

    స్టార్​లింక్​ సేవలను వినియోగదారులకు వేగవంతంగా అందించడానికి ఆధార్​ ఇ–కేవైసీ చేపట్టనున్నారు. పేస్​ రికగ్నేషన్​, బయోమెట్రిక్​ ఆధారంగా స్టార్​లింక్​ కేవైసీ పూర్తి చేస్తుంది. నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విధానం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలు, ప్రపంచ ఉపగ్రహ సాంకేతికత మధ్య సినర్జీని ప్రదర్శిస్తుందని కంపెనీ తెలిపింది.

    Starlink | త్వరలో ప్రారంభం

    స్టార్​లింక్​ దేశంలో త్వరలో తన సేవలను ప్రారంభించనుంది. ఎలాంటి టవర్లు లేకుండా నేరుగా శాటిలైట్​ నుంచి హైస్పీడ్​ ఇంటర్​నెట్(High Speed Internet) అందించడం దీని ప్రత్యేకత. ఇప్పటికే పక్కనున్న బంగ్లాదేశ్​లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ ప్రతి నెల సబ్​స్క్రీప్షన్​ చార్జీలు దాదాపు రూ.3 వేలుగా ఉన్నాయి. మన దగ్గర సుమారుగా అవే ధరలు ఉండే అవకాశం ఉంది.

    Latest articles

    Bhatti Vikramarka | త్వరలో మండలానికో అంబులెన్స్​ : డిప్యూటీ సీఎం భట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ...

    Nizamabad City | దేవాలయ భూములు కాపాడాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | దేవాలయ భూములను కాపాడాలని దేవాలయ పరిరక్షణ సమితి (Devalaya parirakshna Samithi)...

    Mla Laxmi Kantha Rao | మౌళిక వసతుల విస్తరణే లక్ష్యంగా పనిచేస్తున్నాం..

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Mla Laxmi Kantha Rao | గ్రామాల్లో మౌళిక వసతుల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం...

    Banswada | సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్​కు వినతి

    అక్షరటుడే, బాన్సువాడ: Banswada | మోస్రా మండలంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని తహశీల్దార్​ రాజశేఖర్​ను (Tahsildar Rajasekhar) బీజేపీ...

    More like this

    Bhatti Vikramarka | త్వరలో మండలానికో అంబులెన్స్​ : డిప్యూటీ సీఎం భట్టి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bhatti Vikramarka | తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని డిప్యూటీ...

    Nizamabad City | దేవాలయ భూములు కాపాడాలి

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | దేవాలయ భూములను కాపాడాలని దేవాలయ పరిరక్షణ సమితి (Devalaya parirakshna Samithi)...

    Mla Laxmi Kantha Rao | మౌళిక వసతుల విస్తరణే లక్ష్యంగా పనిచేస్తున్నాం..

    అక్షరటుడే, నిజాంసాగర్ ​: Mla Laxmi Kantha Rao | గ్రామాల్లో మౌళిక వసతుల విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం...