ePaper
More
    HomeతెలంగాణShristi Clinic | సరోగసి దోపిడీ.. ప్రతి'సృష్టి' అనుకున్నావా ​డాక్టర్ నమ్రతా..? ​రిపోర్టులో కీలక విషయాలు...

    Shristi Clinic | సరోగసి దోపిడీ.. ప్రతి’సృష్టి’ అనుకున్నావా ​డాక్టర్ నమ్రతా..? ​రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shristi Clinic | ఐవీఎఫ్ (IVF)​, సరోగసి (Surrogacy) పేరిట పలువురిని మోసం చేసిన సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్ (Shristi Test Tube Center)​ డాక్టర్​ నమ్రత రిమాండ్​ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.

    సరోగసి పేరిట దంపతులకు నమ్రత ఇతరుల బిడ్డను అప్పగించిన విషయం తెలిసిందే. రాజస్థాన్​కు (Rajasthan) చెందిన దంపతుల దగ్గర సరోగసి కోసం రూ.40 లక్షల వరకు తీసుకున్న నమ్రత.. పేద మహిళ దగ్గర బిడ్డను రూ.90 వేలుకు బిడ్డను కొనుగోలు చేసి అప్పగించింది. సరోగసి ద్వారా ఆ బిడ్డ పుట్టినట్లు చెప్పింది. అయితే నమ్రత మోసం చేసినట్లు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. డాక్టర్​ నమ్రతతో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్​ చేశారు.

    READ ALSO  Anil Eravatri | బ్రిటీషర్ల తొత్తు..దేశ ద్రోహి వీర్​ సావర్కర్​ : ఈరవత్రి అనిల్​

    Shristi Clinic | ఐదు రోజుల కస్టడీ

    డాక్టర్​ నమ్రతను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా రిమాండ్​ విధించారు. తాజాగా పోలీసులు ఆమెను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్​ వేశారు. డాక్టర్​ నమ్రత రిమాండ్​ రిపోర్టులో వారు కీలక విషయాలు వెల్లడించారు. తాను అక్రమాలకు పాల్పడినట్టు నమ్రత ఒప్పుకున్నారు. సరోగసి పేరిట దంపతులను మోసం చేసినట్టు అంగీకరించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెను ఐదు రోజుల పోలీస్​ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఎంతమంది దంపతులను మోసం చేశారనే విషయాలు తెలిసే ఛాన్స్​ ఉంది.

    Shristi Clinic | ఏఎన్​ఎంల సాయంతో బిడ్డల కొనుగోలు

    డాక్టర్​ నమ్రతకు ఏపీలోని కొందరు ఏఎన్​ఎంలు (ANM) సాయం చేసినట్లు పోలీసులు తెలిపారు. గిరిజన ప్రాంతాలు, పేద దంపతుల పిల్లలను వారి ద్వారా నమ్రత కొనుగోలు చేసేవారు. డబ్బులు ఆశచూపడంతో కొంతమంది ఏఎన్​ఎంలు పిల్లలను తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ పిల్లలను సరోగసి ద్వారా పుట్టారని ఆమె దంపతులకు అప్పగించేది. గాంధీ ఆస్పత్రిలో (Gandhi Hospital) పనిచేసే డాక్టర్‌ సదానందం ఆమెకు సహకరించాడు. ఇప్పటికే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

    READ ALSO  Weather Updates | నేడు తెలంగాణకు వర్ష సూచన

    Shristi Clinic | ప్రశ్నిస్తే బెదిరింపులు

    డాక్టర్​ నమ్రత ఐవీఎఫ్​ కోసం సెంటర్​కు వచ్చే దంపతులను సరోగసి వైపు మళ్లించేది. పిల్లలను అప్పగించిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే నమ్రత బెదిరింపులకు పాల్పడేది. ఆమె కుమారుడు న్యాయవాదిగా ప్రాక్టీస్​ చేస్తున్నాడు. ఆయన సైతం కేసులు వేస్తానని దంపతులను బెదిరించేవాడు. రాజస్థాన్​కు చెందిన దంపతులను సైతం వీరు బెదిరించారు. అయితే వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బండారం బయటపడింది.

    Latest articles

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...

    Bihar | లేడీ కానిస్టేబుల్​పై లైంగిక దాడి..! రెండేళ్లలో మూడు అబార్షన్లు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Bihar : తన సహోద్యోగి (colleague) లైంగికంగా వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు...

    More like this

    Nagpur | భలే కిలేడీ.. ఎనిమిది మంది మగాళ్లను పెళ్లాడి.. తొమ్మిదో పెళ్లి కోసం ప్రయత్నం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nagpur : పెళ్లికాని ఆస్తి పరులైన యువకులే ఆ కిలేడీ లక్ష్యం. మ్యాట్రిమోనీ వెబ్​సైట్లలో (Matrimony...

    Apple | AI పై భారీగా పెట్టుబడులు : Apple CEO Tim Cook

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Apple సీఈఓ Tim Cook ఇటీవల చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కృత్రిమ మేధ(AI)పై భారీగా పెట్టుబడి...

    ED | ఫేక్​ డాక్యుమెంట్లతో రూ.కోట్లలో బ్యాంకు రుణాలు.. సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై ఈడీ కేసు నమోదు

    అక్షరటుడే, హైదరాబాద్: ED : సాయిశ్రీ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈడీ(Enforcement Directorate)కేసు నమోదు చేసింది. హైదరాబాద్‌కు...