KCR
KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి హరీశ్​రావు, కరీంనగర్‌ జిల్లా నుంచి కేటీఆర్‌, సంజయ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హాజరయ్యారు. నల్గొండ నుంచి జగదీష్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.

KCR | 8న కరీంనగర్​లో సభ

బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం ఈ నెల 8న బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో సభ (Karimnagar Sabha) నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సోమవారం నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలని ఈ నెల 6న కాంగ్రెస్ (Congress)​ నాయకులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సభ ఏర్పాట్లపై కేసీఆర్​ నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. బీసీ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. అలాగే జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది.

KCR | కాళేశ్వరం నివేదికపై..

కాళేశ్వరం కమిషన్​ (Kaleswaram Commission) జులై 31న ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికపై సోమవారం మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికపై బీఆర్​ఎస్​ నాయకులు ఎర్రవల్లిలో చర్చించినట్లు తెలిసింది. నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. అనంతరం ఎలా ముందుకు వెళ్లాలని మంతనాలు జరిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం బీఆర్ఎస్​లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. అలాగే స్థానిక ఎన్నికల (Local Body Elections)పై కేసీఆర్​ నాయకులు పలు సూచనలు చేశారు.