ePaper
More
    HomeతెలంగాణGanesh Chaturthi | ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేశ్​ మండపాలకు ఉచిత విద్యుత్​

    Ganesh Chaturthi | ప్రభుత్వం కీలక నిర్ణయం.. గణేశ్​ మండపాలకు ఉచిత విద్యుత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ganesh Chaturthi | మరో మూడు రోజుల్లో వినాయక చవితి (Vinayaka Chaviti) పండుగ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. వాడవాడలా గణనాథులను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు.

    వినాయక చవితి బుధవారం కాగా.. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. గణేశ్​ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి నిర్వాహకులు మండపాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మండపాల నిర్వాహకులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్​ మండపాలకు, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్‌ (Free Current) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Ganesh Chaturthi | అంగరంగ వైభవంగా..

    రాష్ట్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతాయి. వీధివీధిన వినాయక మండపాలతో ఎక్కడా చూసినా ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్​ (Hyderabad) నగరంలో వినాయక చవితి ఘనంగా జరుపుతారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది. నగరంలో వినాయక మండపాలకు ఉచిత విద్యుత్​ ఇస్తామని ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar)​ ప్రకటించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్​ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Ganesh Chaturthi | నిమజ్జనం కోసం రూ.30 కోట్లు

    హైదరాబాద్​ మహా నగరంలో వినాయక నిమజ్జనం (Ganesha immersion) శోభాయామనంగా సాగుతోంది. వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా రోడ్లు భక్తజనంతో కిక్కిరిసిపోతాయి. దీంతో ప్రభుత్వం నగరంలో వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం రూ.30 కోట్లు కేటాయించింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు.

    Latest articles

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...

    Heavy rains in North India | ఉత్తరాదిలో భారీ వర్షాలు.. హిమాచల్​లో 298 మంది బలి.. జేకేలో కుంగిన భారీ వంతెన..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Heavy rains in North India : ఉత్తర భారత్​లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి....

    More like this

    Tollywood film industry | సినిమా పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం : సీఎం రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Tollywood film industry : సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని...

    TPCC Chief Mahesh | తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయి.. టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, హైదరాబాద్: TPCC Chief Mahesh : టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ...

    Gandhari | దాబాలో యథేచ్ఛగా సిట్టింగ్​లు.. యజమానిపై కేసు నమోదు

    అక్షరటుడే, గాంధారి: Gandhari | పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ దాబాల్లో యథేచ్ఛగా సిట్టింగులు కొనసాగుతున్నాయి. దాబాల్లో మద్యం అమ్మరాదని...