HomeతెలంగాణIAS Officers | రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

IAS Officers | రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :IAS Officers | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్​ అధికారులు అదనపు బాధ్యతలు(Additional Responsibilities) అప్పగించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

ఫ్యూచర్​ సిటీ డెవలప్​మెంట్​ అథారిటీ కమిషనర్​గా కొనసాగుతున్న 2013 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి కే శశాంకకు TGIICE వీసీ, ఎండీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆ పోస్టులో ఉన్న ఐఎఫ్​ఎస్​ విష్ణువర్ధన్​రెడ్డి(IFS Vishnuvardhan Reddy)ని తప్పించారు.

తెలంగాణ టూరిజం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఎండీగా ఉన్న వల్లూరు క్రాంతికి మైన్స్(Vallur Kranthik Mines)​, జియోలజీ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు. శశాంకను ఆ పోస్టు నుంచి రిలీవ్​ చేసి, క్రాంతికి బాధ్యతలు అప్పగించారు.సెర్ప్​ సీఈవోగా కొనసాగుతున్న 2017 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి కాత్యాయని దేవికి రాష్ట్ర ఆర్థిక సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్(Joint Managing Director)​ బాధ్యతలు అప్పగించారు.ఖమ్మం మెప్మా పీడీగా ఉన్న పి మహేందర్​ రెడ్డి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ రంగారెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్​గా బదిలీ అయ్యారు.

Must Read
Related News