ePaper
More
    HomeతెలంగాణKCR | కేసీఆర్​ కీలక నిర్ణయం..

    KCR | కేసీఆర్​ కీలక నిర్ణయం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:KCR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( Former Chief Minister KCR)​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

    కాళేశ్వరం కమిషన్​ ఇటీవల కేసీఆర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్​ నోటీసు(Commission Notice)ల్లో పేర్కొంది. కమిషన్​ విచారణకు హాజరు అవుతానని కేసీఆర్​ ఇటీవల తెలిపారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న అప్పటి నీటిపారుదల శాఖ మంత్రితో కేసీఆర్​ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్​(Erravelli Farmhouse)లో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 5న కాకుండా 11న విచారణకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.

    కాళేశ్వరం కమిషన్​ కేసీఆర్​తో పాటు, మాజీ మంత్రులు హరీశ్​రావు(Former Minister Harish Rao), ఈటల రాజేందర్(Etala Rajender)​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న కేసీఆర్​, 6న హరీశ్​రావు, 9న ఈటలను విచారణకు రావాలని కమిషన్​ పేర్కొంది. ఈ క్రమంలో కేసీఆర్​ జూన్​ 5కు బదులుగా 11న విచారణకు హాజరు అవుతానని కమిషన్​కు తెలిపారు.

    ఈ విషయాన్ని ఆయన కమిషన్​కు తెలపగా అంగీకరించింది. కాగా.. తాను విచారణకు హాజరు అవుతానని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. మరో మాజీ మంత్రి హరీశ్​రావు విచారణకు హాజరు అవుతారా..? అయితే ఏ రోజు వెళ్తారనే..? విషయాలు ఇంకా వెల్లడించలేదు.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...