HomeతెలంగాణKCR | కేసీఆర్​ కీలక నిర్ణయం..

KCR | కేసీఆర్​ కీలక నిర్ణయం..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:KCR | బీఆర్​ఎస్​ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( Former Chief Minister KCR)​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కాళేశ్వరం కమిషన్​ ఇటీవల కేసీఆర్​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న విచారణకు హాజరు కావాలని కమిషన్​ నోటీసు(Commission Notice)ల్లో పేర్కొంది. కమిషన్​ విచారణకు హాజరు అవుతానని కేసీఆర్​ ఇటీవల తెలిపారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న అప్పటి నీటిపారుదల శాఖ మంత్రితో కేసీఆర్​ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్​(Erravelli Farmhouse)లో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 5న కాకుండా 11న విచారణకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు.

కాళేశ్వరం కమిషన్​ కేసీఆర్​తో పాటు, మాజీ మంత్రులు హరీశ్​రావు(Former Minister Harish Rao), ఈటల రాజేందర్(Etala Rajender)​కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్​ 5న కేసీఆర్​, 6న హరీశ్​రావు, 9న ఈటలను విచారణకు రావాలని కమిషన్​ పేర్కొంది. ఈ క్రమంలో కేసీఆర్​ జూన్​ 5కు బదులుగా 11న విచారణకు హాజరు అవుతానని కమిషన్​కు తెలిపారు.

ఈ విషయాన్ని ఆయన కమిషన్​కు తెలపగా అంగీకరించింది. కాగా.. తాను విచారణకు హాజరు అవుతానని మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా తెలిపిన విషయం తెలిసిందే. మరో మాజీ మంత్రి హరీశ్​రావు విచారణకు హాజరు అవుతారా..? అయితే ఏ రోజు వెళ్తారనే..? విషయాలు ఇంకా వెల్లడించలేదు.

Must Read
Related News