KCR
Kaleshwaram Commission | కాళేశ్వరం విచారణకు బయలుదేరిన కేసీఆర్​.. బీఆర్​కే భవన్ వద్ద ఉద్రిక్తత

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kaleshwaram Commission | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​(Former CM KCR) కాళేశ్వరం కమిషన్​ ఎదుట విచారణ కోసం ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్​ నుంచి బయలు దేరారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ నిర్మాణంలో అక్రమాలు, అవినీతిపై విచారణకు ప్రభుత్వ కాళేశ్వరం కమిషన్​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిషన్​ ఛైర్మన్​ పీసీ ఘోష్(Commission Chairman PC Ghosh)​ ఇదివరకే అధికారులతో పాటు మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​ను విచారించారు. ఈ క్రమంలో నేడు కేసీఆర్​ను బీఆర్​కే భవన్​(BRK Bhavan)లో విచారించనున్నారు. దీంతో ఆయన ఉదయం 11.15 వరకు కమిషన్ ఆఫీస్​కు చేరుకోనున్నారు.

Kaleshwaram Commission | ఫామ్​హౌస్​కు​ ఎమ్మెల్సీ కవిత

ఎర్రవల్లిలోని కేసీఆర్​ ఫామ్​హౌస్​కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) బుధవారం ఉదయం వెళ్లారు. ఆయన కాళేశ్వరం విచారణకు వెళ్లనున్న నేపథ్యంలో కవిత వెళ్లి కలిశారు. కాగా. ఇటీవల కేసీఆర్​ లేఖ వివాదం తర్వాత కవిత ఫామ్​హౌస్(Farmhouse)​కు వెళ్లడం ఇదే మొదటిసారి.

Kaleshwaram Commission | కార్యకర్తల ఆందోళన

హైదరాబాద్​లోని బీఆర్​కే భవన్​ వద్ద కేసీఆర్​ను కాళేశ్వరం కమిషన్​(Kaleshwaram Commission) విచారించనుంది. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఆందోళన చేపడుతున్నారు. కేసీఆర్​కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. దీంతో బీఆర్​కే భవన్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెయిన్​ గేటు వద్ద ఆందోళన చేపడుతున్న కార్యకర్తలను పోలీసులు లోనికి అనుమతించడం లేదు. కేసీఆర్​ విచారణ నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.