Kalvakuntla Kavitha | తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిన కవిత.. కొత్త పార్టీ సంకేతాలు, ఎక్క‌డ నుండి పోటీ?

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kalvakuntla Kavitha | తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గురించే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న అనంతరం ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భారాస నుంచి సస్పెండ్​ అయిన తర్వాత ఆ పార్టీ వల్ల లభించిన పదవి తనకు వద్దంటూ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మండలి […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kalvakuntla Kavitha | తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు మరింత వేడెక్కుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఎవరిని కదిలించినా జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గురించే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి సస్పెన్షన్ ఎదుర్కొన్న అనంతరం ఆమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. భారాస నుంచి సస్పెండ్​ అయిన తర్వాత ఆ పార్టీ వల్ల లభించిన పదవి తనకు వద్దంటూ కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

మండలి ఛైర్మన్​కు రిజైన్ లెటర్​ను కవిత పంపించి ఆమోదం తెలపాలని విన్నవించారు. ఎమ్మెల్సీ కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) ఆమోదించారు. అయితే ఈ పరిణామాల మధ్యనే, తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరించబోతుందనే సంకేతాలను కవిత పరోక్షంగా ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Kalvakuntla Kavitha | క‌విత ఏం చెప్ప‌నుంది?

ఈ నేపథ్యంలో మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించడం మరింత ప్రాధాన్యం దక్కించుకుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జాగృతి అనుబంధంగా ఉన్న 23 సంస్థల నేతలు హాజరయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికల వ్యూహం, కొత్త పార్టీ ఏర్పాటు వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించడంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా, 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాల (Mancherial)లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే సభ వేదికగా కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

మంచిర్యాలలోనే సభ నిర్వహించడానికి గల కారణాలపై కూడా ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. కవిత గతంలో టీజీబీకేఎస్ (తెలంగాణ గని బొగ్గు కార్మిక సంఘం) గౌరవ అధ్యక్షురాలిగా పని చేసిన నేపథ్యం ఉండటంతో, సింగరేణి కార్మికుల్లో (Singareni Workers) ఆమెకు మంచి పట్టు ఉందని నాయకులు భావిస్తున్నారు. ఆ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకునే మంచిర్యాల కేంద్రంగా సభ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు, భవిష్యత్తులో కవిత మంచిర్యాల నుంచే పోటీ చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగితే రాజకీయంగా ఆమెకు మరింత అనుకూలంగా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లు టాక్. ఇక ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చకు దారి తీసింది. సాధారణంగా రాజకీయ సమావేశాలకు కుటుంబ సభ్యులను తీసుకురాని కవిత, ఈసారి తన కుమారులను సమావేశానికి తీసుకురావడం వెనక ప్రత్యేక వ్యూహం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...