Kavitha Janam Bata | సబితా ఇంద్రారెడ్డిపై కవిత సంచలన ఆరోపణలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Janam Bata | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై (Sabita Indra Reddy) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరంలో (Maheshwaram) ఆమె అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారన్నారు. కబ్జాలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో (Jagruti Janambata program) భాగంగా కవిత శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kavitha Janam Bata | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై (Sabita Indra Reddy) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సంచలన ఆరోపణలు చేశారు.

మహేశ్వరంలో (Maheshwaram) ఆమె అనుచరులే చెరువులను కబ్జా చేస్తున్నారన్నారు. కబ్జాలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. హైడ్రా కూడా కబ్జాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

జాగృతి జనంబాట కార్యక్రమంలో (Jagruti Janambata program) భాగంగా కవిత శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఎల్బీ నగర్​లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా యాత్ర చేపట్టామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రస్తుతం సమాజంలో మార్పు కోసం జాగృతి పని చేస్తుందని చెప్పారు. భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని, సామాజిక తెలంగాణ కోసం జాగృతి పోరాడుతోందని ఆమె పేర్కొన్నారు.

Kavitha Janam Bata | ఆర్​ఆర్​ఆర్​ అలైన్​మెంట్​ మార్పు

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో (Serilingampalli constituency) అనేక చెరువులు కబ్జాకు గురయ్యాయని కవిత అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైడ్రా అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చెరువుల కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తామన్నారు. తొమ్మిదిరెట్ల గ్రామంలో ఆర్ఆర్​ఆర్​ అలైన్​మెంట్​​ను నాలుగు సార్లు మార్పు చేశారని చెప్పారు. సీఎం రేవంత్​రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి భూములు ఉన్నందుకు అలైన్​మెంట్​ మార్చారని ఆరోపించారు. బీఆర్​ఎస్​ నాయకుల భూములు కూడా అక్కడ ఉన్నాయన్నారు. అలైన్​మెంట్​ మార్పుపై తాను కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీకి లేఖ రాస్తానని చెప్పారు. రీ సర్వే జరిపి పేద రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు.

Related articles

BJP Condemns Attacks | అమాయకులపై అసాంఘిక శక్తుల దాడులను ఖండిస్తున్నాం..

అమాయక ప్రజలపై అసాంఘిక శక్తుల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఈ మేరకు ఆయన బాధితులతో కలిసి సీపీ సాయి చైతన్యకు మంగళవారం వినతిపత్రం అందజేశారు.

KTR Political Warning | అధికారం శాశ్వతం కాదు.. మళ్లీ కేసీఆర్​ సీఎం అవుతారు : కేటీఆర్

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Political Warning | డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Reddy) రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు,...

Kamareddy Education Demand | కామారెడ్డిలో విద్యాసంస్థల ఏర్పాటుపై దృష్టి పెట్టండి.. విద్యార్థి సంఘాల సూచన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాల్లో విద్యాసంస్థల ఏర్పాటుకు నాయకులు కృషి చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Stock Market Crash | బేర్ దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్.. రూ. 2.71 లక్షల కోట్ల సంపద ఆవిరి

స్టాక్ మార్కెట్‌పై బేర్ పంజా విసిరింది. దీంతో అన్ని రంగాలూ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 288 పాయింట్ల నష్టంతో ముగిశాయి.