Kalvakuntla Kavitha | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కవిత

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భర్త అనిల్​తో కలిసి ఆలయంలో ఆమె పూజలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో మాజీ మంత్రి హరీశ్​రావు, సంతోష్​రావుపై ఆరోపణలు చేసిన తర్వాత కవితను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ అంశాలపై పోరాటాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల (BC […]

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kalvakuntla Kavitha | తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భర్త అనిల్​తో కలిసి ఆలయంలో ఆమె పూజలు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్​ విషయంలో మాజీ మంత్రి హరీశ్​రావు, సంతోష్​రావుపై ఆరోపణలు చేసిన తర్వాత కవితను బీఆర్​ఎస్​ నుంచి సస్పెండ్​ చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. వివిధ అంశాలపై పోరాటాలు చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం నిర్వహించిన బంద్​లో ఆమె తన కుమారుడితో కలిసి పాల్గొన్నారు. త్వరలో కవిత జాగృతి జనంబాట (Jagruthi Janam Bata) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు.

Kalvakuntla Kavitha | సంతోషంగా ఉంది

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని కవిత అన్నారు. ఈనెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు చేరువ కావడానికి ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నాలుగు నెలల పాటు సాగే జనంబాట విజయవంతం కావాలని స్వామి వారిని కోరినట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆమె తిరుమల హథీరామ్ భావాజీ మఠంలో బార్సీ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన భోగ్ భండార్‌లో పాల్గొన్నారు. బంజారా పూజారులు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్ రూప్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

GeoSpy AI | లొకేషన్‌తో పనిలేకుండా ఫొటో అడ్రస్ పట్టేస్తుంది

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: GeoSpy AI | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence - AI) వినియోగం పెరిగాక ప్రతి విషయం తెలుసుకోవడంలో స్పష్టత మరింత...

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.