అక్షరటుడే, వెబ్డెస్క్: Doha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kavitha) ఖతార్లోని దోహాలో ఘనస్వాగతం లభించింది. బతుకమ్మ సంబరాల్లో (Bathukamma Sambaram) భాగంగా ఆమె దోహా చేరుకున్నారు. తెలంగాణ జాగృతి ఖతర్ శాఖ (Telangana Jagruti Qatar Branch) ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా దోహా ఎయిర్పోర్టులో (Doha Airport) ఆమెకు శాఖ మహిళా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడంతో తాను దోహకు వచ్చానని.. ఇక్కడి తెలుగువారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.