Karur Incident | కరూర్​కు​ విజయ్​ రాకను కావాలనే ఆలస్యం చేశారు.. ప్రాథమిక నివేదికలో సంచలన విషయాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karur Incident | తమిళనాడు (Tamil Nadu) లోని కరూర్​లో శనివారం (సెప్టెంబరు 27, 2025) జరిగిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) Tamil Vetri Kazhagam (TVK) నాయకుడు విజయ్ సమావేశంలో జరిగిన తొక్కిసలాట తమిళనాడులో చరిత్రలో ఓ మాయని మచ్చ. కాగా, దీనిపై కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి సమాచార నివేదిక (ఎఫ్​ఐఆర్​) లో పార్టీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి పట్టణంలోకి విజయ్ రావడాన్ని ఆలస్యం […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karur Incident | తమిళనాడు (Tamil Nadu) లోని కరూర్​లో శనివారం (సెప్టెంబరు 27, 2025) జరిగిన తమిళగ వెట్రీ కజగం (టీవీకే) Tamil Vetri Kazhagam (TVK) నాయకుడు విజయ్ సమావేశంలో జరిగిన తొక్కిసలాట తమిళనాడులో చరిత్రలో ఓ మాయని మచ్చ.

కాగా, దీనిపై కరూర్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి సమాచార నివేదిక (ఎఫ్​ఐఆర్​) లో పార్టీ నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్లాన్ చేసి పట్టణంలోకి విజయ్ రావడాన్ని ఆలస్యం చేశారని పొందుపర్చారు.

తాగునీరు, ఆహారం, వైద్య సాఆయం లేకుండా చాలా గంటలు వేచి ఉన్న ప్రజలు వేడి, రద్దీ కారణంగా అలసిపోయారని, ఫలితంగా తొక్కిసలాట జరిగి Karur Incident అనేక మంది మరణించారని ఎఫ్ఐఆర్​లో పొందుపర్చారు పోలీసులు.

Karur Incident | సుమోటోగా..

కరూర్ టౌన్ పోలీస్ స్టేషన్ Karur Town Police Station ఇన్​స్పెక్టర్​ జి. మణివన్నన్ శనివారం రాత్రి సుమోటోగా ఫిర్యాదు చేయడంతో భారతీయ న్యాయ సంహితలోని నాలుగు సెక్షన్లు, తమిళనాడు ప్రజా ఆస్తి (నష్టం, నష్ట నివారణ) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ‘బస్సీ’ ఆనంద్, పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సి.టి.ఆర్. పై కేసు నమోదైంది. నిర్మల్ కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి మతియజగన్ నిందితులుగా ఉన్నారు.

ఎఫ్ఐఆర్ ప్రకారం.. వేలుసామిపురం (Velusamipuram) లో విజయ్ ప్రచారం కోసం కరూర్ పట్టణం, దాని పరిసరాల్లో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ కోసం సుమారు 500 మంది పోలీసు సిబ్బంది, హోమ్ గార్డులను నియమించారు.

విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు కరూర్‌కు వస్తారనే నివేదికల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

విజయ్ సమావేశానికి పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా ప్రణాళిక వేసుకుని, తమ రాజకీయ బలాన్ని ప్రదర్శించాలనే ఉద్దేశంతో విజయ్ రాకను నాలుగు గంటలు ఆలస్యం చేశారని FIRలో పొందుపర్చారు. చాలా గంటలు వేచి ఉన్న ప్రజలు అలసిపోయారు.

 Karur Incident | ఉదయం నుంచే..

వేలుసామిపురం ప్రధాన రహదారి, కోవై రోడ్డు, మునియప్పన్ కోయిల్ జంక్షన్, తిరుకంపులియూర్ రౌండ్‌తానా, మధురై-సేలం బైపాస్ రోడ్డు వద్ద ఉదయం 10 గంటల నుంచే ప్రజలు, పార్టీ మద్దతుదారులు రావడం మొదలెట్టారని ఎఫ్​ఐఆర్​ చెబుతోంది. 10,000 మంది కేడర్ వస్తారని మతియఝగన్ పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, 25,000 మందికి పైగా ప్రజలు వచ్చారు.

విజయ్ వేలాయుతంపాళయం, తవిటుపాళయం సరిహద్దు ద్వారా కరూర్ జిల్లాలోకి సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో ప్రవేశించినట్లు FIR పేర్కొంది. అనుమతి లేకుండా రోడ్‌షోలో ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి, ప్రజలకు, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని, తద్వారా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మునియప్పన్ కోయిల్ జంక్షన్‌కు చేరుకోవడానికి అనేక చోట్ల నిబంధనలను ఉల్లంఘించారని ఎఫ్​ఐఆర్​లో నిక్షిప్తం చేశారు.

విజయ్ వాహనాన్ని క్యారేజ్‌వే యొక్క తప్పు వైపున (కుడి వైపున) వేలుసామిపురం జంక్షన్‌కు చేరుకుని, సాయంత్రం 7 గంటలకు పెద్ద జనసమూహం మధ్యలో ఆపారని ఎఫ్‌ఐఆర్‌లో రాసుకొచ్చారు.

ఇన్‌స్పెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆనంద్ కలిసి.. నిర్మల్ కుమార్, మతియజగన్‌ను చాలాసార్లు హెచ్చరించారని పోలీసులు చెబుతున్నారు.

బందోబస్తు కోసం మోహరించిన పోలీసు సిబ్బంది.. పరిస్థితిని ముందే అంచనా వేసి హెచ్చరించారంటున్నారు. కానీ, పోలీసు అధికారుల మాటలను నిర్వాహకులు పట్టించుకోలేదని ఎఫ్ఐఆర్​ చెబుతోంది.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. ప్రజలు దుకాణాలు, సమీపంలోని చెట్లపై నిర్మించిన వాలుగా ఉన్న టిన్ పైకప్పులపైకి ఎక్కారు. వారి బరువు​ ఆపలేక టిన్ షెడ్లు, చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. దీంతో కింద నిలబడిన వారిపై పైనున్నవారు పడిపోయారు. ఈ క్రమంలోనే ఊపిరాడక మరణాలు సంభవించాయి.

Related articles

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.