అక్షరటుడే, వెబ్డెస్క్: Actress Ranya Rao | స్మగ్లింగ్ కేసులో (smugling case) అరెస్టు అయిన కన్నడ నటి రన్యా రావుకు (Actress Ranya Rao) ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రన్యతో పాటు సహా నిందితుడు కొండూరు రాజుకు కూడా బెయిల్ మంజూరైంది. ఇద్దరు పూచీకత్తులతో పాటు రూ. 2 లక్షల వ్యక్తిగత బాండ్ను సమర్పించాలనే షరతుపై ఇద్దరినీ విడుదల చేయడానికి కోర్టు ఆమోదం తెలిపింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) చార్జ్షీట్ సమర్పించడంలో విఫలం కావడంతో ప్రత్యేక కోర్టు నిందితులకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ విశ్వనాథ్ సి గౌడర్ (Justice Vishwanath C Gowder) ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, నిందితులు దేశం విడిచి వెళ్లకూడదని, దర్యాప్తులో జోక్యం చేసుకోకూడదని షరతులు విధించింది.
Actress Ranya Rao | కస్టడీలోనే..
బెయిల్ పొందినప్పటికీ, రన్యా రావు (ranya rao) కస్టడీలోనే ఉండనున్నారు. ఎందుకంటే ఆమెపై కఠినమైన విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం, 1974 COFEPOSA కింద కేసు నమోదైంది. అక్రమ రవాణాను నిరోధించడం, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడడం లక్ష్యంగా COFEPOSA చట్టాన్ని రూపొందించారు. ఆయా కార్యకలాపాలలో పాల్గొన్నట్లు అనుమానించిన వ్యక్తులను నిర్బంధించడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.
Actress Ranya Rao | బంగారం అక్రమ తరలింపు..
రాన్యా రావు, సహా నిందితుడు రాజు (co-accused Raju) దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం దిగుమతి చేస్తూ దొరికిపోయారు. రూ.12.56 కోట్ల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని (gold) అక్రమంగా దిగుమతి చేసుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపణలు ఉన్నాయి. మార్చి 3, 2025న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో (Kempegowda International Airport) దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 14.8 కిలోల బంగారంతో రన్యా రావు పట్టుబడ్డారు. తదుపరి దర్యాప్తులో రన్యా 2023, 2025 మధ్య 45 సార్లు దుబాయ్కు ప్రయాణించిందని, దీనితో ఆమె విస్తృత స్మగ్లింగ్ నెట్వర్క్లో (smugling network) పాల్గొన్నారనే అనుమానం తలెత్తింది. తదుపరి దర్యాప్తులో నటుడు, వ్యాపారవేత్త తరుణ్ రాజుతో కలిసి 2023లో అతను స్థాపించిన దుబాయ్లోని (dubai) వీర డైమండ్స్ ట్రేడింగ్ సంస్థతో అతని సంబంధాలు వెల్లడయ్యాయి.