Homeజిల్లాలునిజామాబాద్​Kammarpally | బీజేపీలో చేరిన కమ్మర్​పల్లి వీడీసీ అధ్యక్షుడు

Kammarpally | బీజేపీలో చేరిన కమ్మర్​పల్లి వీడీసీ అధ్యక్షుడు

దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఆ పార్టీలో చేరుతున్నట్లు కమ్మర్​పల్లి వీడీసీ అధ్యక్షుడు భోగ రామస్వామి అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్​ఛార్జి ఏలేటి మల్లికార్జున్ ​రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Kammarpally | కమ్మర్​పల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు భోగ రామస్వామి మంగళవారం బీజేపీలో చేరారు. బాల్కొండ నియోజకవర్గ (Balkonda constituency) ఇన్​ఛార్జి ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ.. దేశ ప్రధాని మోదీ (PM Modi), ఎంపీ అర్వింద్​ (MP Arvind) పాలన పట్ల ఆకర్షితుడినై బీజేపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సున్నం మోహన్, కార్యదర్శి బలరాం, బీజేవైఎం అధ్యక్షుడు కొత్తపల్లి గణేష్, బీజేపీ నాయకులు రెంజల్ల గంగాధర్, కొత్తపల్లి అరుణ్, చింత ప్రవీణ్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.