ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | ప్రియుడి కోసం కుమారుడి విక్రయం.. ఆస్తి కోసం మళ్లీ కావాలని ఫిర్యాదు

    Kamareddy | ప్రియుడి కోసం కుమారుడి విక్రయం.. ఆస్తి కోసం మళ్లీ కావాలని ఫిర్యాదు

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి/ఎల్లారెడ్డి : సహజీవనం చేస్తున్న ప్రియుడి కోసం తన కుమారుడిని విక్రయించిందో మహిళ. తర్వాత ప్రియుడు తన భార్య దగ్గరకు వెళ్లడంతో అత్తింటి వారి దగ్గర ఆస్తిలో వాటా కోసం మళ్లీ బిడ్డను ఇప్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. సీడీపీవో స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన బూస లావణ్యకు నర్సింలు అనే వ్యక్తితో పెళ్లయింది. వీరికి ఐదేళ్ల బాబు, నాలుగేళ్ల పాప ఉన్నారు. అనారోగ్యం నర్సింలు మృతి చెందగా.. లావణ్య బట్టల షాపులో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన సాయిలుతో లావణ్యకు పరిచయం అయింది. దీంతో ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.

    Kamareddy | ఆటో కోసం..

    సాయిలు ఉపాధి కోసం ఆటో కొనివ్వడానికి తన కుమారుడు నిఖిల్​ను లావణ్య విక్రయించింది. పర్మల్ల గ్రామానికి చెందిన దూదేకుల నసీమాకు రూ.50 వేలకు కుమారుడిని అమ్మేసి, ప్రియుడికి ఆటో కొనిచ్చింది. అయితే సాయిలుకు ఇదివరకే పెళ్లయిందని లావణ్యకు తెలియడం, సాయిలు భార్య వచ్చి గొడవ చేయడంతో లావణ్య మళ్లీ ఒంటరి అయింది. అయితే తన అత్తింట్లో భర్త తరఫున ఆస్తిలో వాటా తీసుకోవాలని భావించింది. అయితే కుమారుడు ఉంటేనే ఆస్తిలో వాటా ఇస్తారని బిడ్డ కోసం లావణ్య పర్మళ్ల గ్రామానికి వెళ్లింది. అయితే అప్పటికే నసీమా బాబును మెదక్ జిల్లా రాజీపేటకు చెందిన తన సోదరి షాహిదాకు విక్రయించింది. షాహిదా ఆ బాబును అదే గ్రామానికి చెందిన కుంచాల శేఖర్​కు రూ.లక్షకు అమ్మేసింది. ఈ క్రమంలో లావణ్య తనబిడ్డను తనకు ఇవ్వడం లేదని ఈ నెల 4 న పోలీసులకు ఫిర్యాదు చేయగా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, పోలీసులు బాబును తీసుకువచ్చి బాల సంరక్షణ అధికారులకు అప్పగించారు. బాబు తల్లి లావణ్య, సాయిలు, నసీమా, షాహిదా, శేఖర్​లపై కేసు నమోదు చేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...