అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP Rajesh Chandra | కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడి కారుకు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఒక ప్రకటనలో తెలిపారు.
Kamareddy SP Rajesh Chandra | క్యాంప్ కార్యాలయం వద్ద..
కారు దహనం చేసిన ఘటనలో మిగితా వారి గురించి గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా క్యాంప్ కార్యాలయం వద్దకు వచ్చిన పోసానిపేట(Posanipet) మాజీ సర్పంచ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. కారుకు నిప్పు పెట్టగా పోలీసులు మంటలను ఆర్పివేశారు.
ఉదయం నుంచి ఉద్రిక్తత..
కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల(Kamareddy Government College) భూముల విషయంలో శనివారం ఉదయం నుంచి ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కేవీఆర్, ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు ఐరేని సందీప్ ఇరువురు స్థానిక శిశుమందిర్కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కళాశాల ఆస్తుల విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. పరిస్థితి చేయిదాటే పరిస్థితి రావడంతో కామారెడ్డి ఎస్పీ రాజేష్చంద్ర ముందస్తుగా ఎమ్మెల్యే కేవీఆర్ను ఇంట్లో నుంచి రావొద్దని కోరారు. దీంతో ఆయన ఇంట్లోనే ఉండిపోయారు. అనంతరం శిశుమందిర్ వద్దకు వచ్చేందుకు ప్రయత్నించిన ఐరేని సందీప్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.





