అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy police | ఫేస్బుక్, వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ కరెన్సీపై ప్రచారం చేస్తూ.. సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు (Kamareddy police) అరెస్ట్ చేశారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులకు తెలియకుండా జరుగుతున్న ఈ ముఠా వ్యవహారాన్ని కామారెడ్డి పోలీసులు గుట్టురట్టు చేశారు.
ఈ మేరకు ముఠాకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శనివారం మీడియాకు వెల్లడించారు. గతనెల 23న మద్యం దుకాణంలో పని చేసే అఖిల్కు ఓ వ్యక్తి రెండు ఫేక్ రూ.500 నోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లాడు. తర్వాత అవి నకిలీ నోట్లు గుర్తించిన అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Kamareddy police | శాబ్దిపూర్లో మొదలైన ఫేక్ కరెన్సీ బాగోతం..
శాబ్దిపూర్ గ్రామానికి చెందిన సిద్దాగౌడ్ అనే వ్యక్తి దొంగనోట్లు ఇచ్చి మద్యం తీసుకెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా సులభంగా డబ్బు సంపాదించాలని ఫేస్బుక్ యాడ్ ద్వారా అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేసినట్టుగా వెల్లడించాడు. వెస్ట్ బెంగాల్కు చెందిన సౌరవ్డే అనే వ్యక్తి సిద్దాగౌడ్కు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అతనికి కాంటాక్ట్ అయ్యాడని, ఫేక్ కరెన్సీ కావాలని అడిగితే రూ.5వేలకు రూ.10వేల నకిలీ నోట్లు పంపుతామని ఒప్పందం కుదుర్చుకున్నాడని చెప్పాడు. 18న కొరియర్ ద్వారా 18 నకిలీ నోట్లు పంపగా అందులో నుంచి రెండు నోట్లు తీసుకెళ్లి మద్యం కొనుగోలు చేసినట్లు తేలింది.
Kamareddy police | 8 ప్రత్యేక బృందాలతో..
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఎస్పీ రాజేష్ చంద్ర .. ముఠా కోసం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీఎస్ బృందం వెస్ట్ బెంగాల్ (West Bengal) వెళ్లి సౌరవ్డేను గత నెల 27న పట్టుకుని విచారించగా హరి నారాయణ భగత్ అనే వ్యక్తితో కలిసి నకిలీ నోట్లను బీహార్కు చెందిన రషీద్ నుంచి కొరియర్ ద్వారా తెప్పించుకుని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. సౌరవ్డే, హరి నారాయణ భగత్లను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. అనంతరం బీహార్కు (Bihar) వెళ్లిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో రషీద్ను పట్టుకున్నారు. రషీద్ ఎంఎస్సీ చదువుకున్నాడని, అతనికి కలర్, కెమికల్ మిక్సింగ్పై అవగాహన ఉండటంతో నకిలీ నోట్ల తయారీతో డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
Kamareddy police | ఛత్తీస్గఢ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు..
ఛత్తీస్గఢ్కు (Chhattisgarh) చెందిన నందులాల్ జంగ్డే, చట్టరామ్, వెస్ట్ బెంగాల్కు చెందిన సౌరవ్ డే, హరి నారాయణ భగత్, పండిత్ అలియాస్ శారతక్, ఉత్తర ప్రదేశ్కు చెందిన కరెన్సీ కాట్ని అలియాస్ లఖన్ కుమార్ దుటే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, మహారాష్ట్రకు చెందిన శివశర్మ అలియాస్ ప్రమోద్ కాట్రేలు ఒక గ్రూపుగా ఏర్పడి నకిలీ కరెన్సీ తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగానే నందులాల్ జంగ్డే, చట్టరామ్, రషీద్ కలిసి బిక్రమ్ గంజిలో వివిధ షాపుల్లో కరెన్సీ తయారీకి కావాల్సిన కంప్యూటర్, కలర్స్, ఇంక్ ప్రింటర్స్, కట్టర్స్, ల్యామినేటర్స్, టోనర్స్, కలర్ ప్రింటర్ ఇతర సామగ్రిని కొనుగోలు చేశారు.
Kamareddy police | కొరియర్ల ద్వారా ఫేక్ కరెన్సీ..
అనంతరం 500, 200, 100, 50, 20 రూపాయల నకిలీ నోట్లను 1:2 రేషియో ద్వారా ఆర్డర్ తీసుకుని ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన కస్టమర్ల నుంచి వివిధ నంబర్ల స్కానర్లకు డబ్బులు పంపించుకుని కొరియర్ ద్వారా ఫేక్ కరెన్సీని పంపిస్తున్నారు. ఇందులో రషీద్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియా (Social Media) ద్వారా ఏర్పాటు చేసుకున్న ఏజెంట్లకు 1:0.5 రేషియో ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. ఈ ముఠా 2024లో రూ.2,17,000 నోట్లను సరఫరా చేసిందని ఎస్పీ తెలిపారు.
ఆర్డర్ తీసుకున్న హైదరాబాద్ (Hyderabad) వ్యక్తి వద్ద రూ.63,000 లభించాయని, ఇంకా రూ.37 వేలు ఇతర వాటికి ఖర్చయినట్లు తెలిపాడని ఎస్పీ వివరించారు. తమిళనాడుకు (Tamil Nadu) చెందిన ఓ వ్యక్తి రూ.3 కోట్లకు ఆర్డర్ పెట్టారన్నారు. అతడిని అరెస్ట్ చేశామని, అతని తండ్రి పరారీలో ఉన్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ఆపరేషన్కు ఇతర రాష్ట్రాల పోలీసులు పూర్తిగా తమకు సహకరించారని తెలిపారు.
Kamareddy police | 15రోజులు.. 8 బృందాలు.. 900కి.మీ..
15 రోజులు 8 బృందాలు 900 కిలోమీటర్ల రెస్క్యూ ఆపరేషన్ చేసిందని ఎస్పీ పేర్కొన్నారు. బీహార్లో జరిగిన ఆపరేషన్ డేంజర్గా సాగిందని, కోల్కతాలో (Kolkata) జనావాసాల మధ్య నిందితులను పట్టుకోవడం కష్టతరంగా మారిందని, యూపీ, మహారాష్ట్రలో డెకాయ్ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. సెంట్రల్ రైల్వే తమకు పూర్తిగా సహకరించిందని తెలిపారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లో అక్కడి పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారని, వాళ్లను తాము కస్టడీకి కోరి విచారణ చేపడతామన్నారు.
నకిలీ నోట్ల సరఫరా రాష్ట్రాల మధ్యనే సాగిందా..? ఇతర దేశాలకు సరఫరా చేశారా అనే ప్రశ్నకు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. ఆ విషయం తదుపరి విచారణలో తేలుతుందన్నారు. ముఠాలో 12 మంది ఉన్నారని, అందులో రషీద్, కరెన్సీ కాట్నే, దివాకర్ చౌదరి, సత్యదేవ్ యాదవ్, సౌరవ్ డే, హరి నారాయణ భగత్, సిద్దాగౌడ్, కృతిక రాజ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. మరో నలుగురు నందులాల్ జంగ్ డే, చట్టరామ్, పండిత్, శివ శర్మలు పరారీలో ఉన్నారని వారిని సైతం త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన అఖిల్ను ఎస్పీ శాలువాతో సత్కరించి నగదు బహుమతి అందజేశారు. అలాగే ఆపరేషన్ ఫేక్ కరెన్సీ ముఠాలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి నగదు ప్రోత్సాహకం అందజేసి అభినందించారు. కలకత్తా ఆపరేషన్లో స్వయంగా పాల్గొన్న ఏఎస్పీ చైతన్య రెడ్డిని (ASP Chaitanya Reddy) ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు.
Kamareddy police | పోలీసులు స్వాధీనం చేసుకున్నవి..
అయితే పోలీసుల ఆధీనంలో ప్రస్తుతం.. రూ.3,08,300 ఫేక్ కరెన్సీ.. రూ.15,300 ఒరిజినల్ నగదు, రూ.8,830 సగం ప్రింట్ అయిన కరెన్సీ, బ్రీజా కారు, 9 మొబైల్స్, వైట్ కలర్ పేపర్ బండిల్స్, వైట్ బాండ్ పేపర్, గ్రీన్ కలర్ ఫాయిల్, బ్లూ కలర్ ఫాయిల్, సిల్వర్ కలర్ ఫాయిల్, ట్రాకింగ్ పేపర్, 4 ప్రింటర్లు, స్కానర్స్, సెక్యూరిటీ థ్రెడ్ వైట్ పేపర్, మల్టీ కలర్ రబ్బర్స్, అల్టిమేట్ 12 కంపెనీ లామినేటర్ మిషన్, ఒక కంప్యూటర్, మానిటర్, సీపీయూ, కీబోర్డు, మౌజ్, కలర్స్ అండ్ జ్యూడిషియల్ స్టాంప్ పేపర్స్, పెన్ డ్రైవ్, కటింగ్ పేపర్స్, కట్టర్స్ ఉన్నాయని ఎస్పీ వివరించారు.